Mass Wedding: స్వేచ్ఛ బ్యూరో: శ్రీ జ్ఞానేశ్వర వాత్సల్య మందిరం అ రక్షిత బాలికల ఆశ్రమంలో ఆదివారం జరిగిన పార్వతీ బాలరాజుల కళ్యాణోత్సవం వైభవంగా జరిగినట్లు ఆశ్రమ నిర్వాహకులు ఆకారపు విశ్వనాథం తెలిపారు. అరక్షిత బాలికల ఆశ్రమంలో పార్వతి 16 సంవత్సరాలుగా ఉంటోందని అన్నారు. రేవల్లికి చెందిన బాలరాజుతో వివాహం జరగడం శుభపరిణామం అని అన్నారు. కళ్యాణ దాతలుగా జర్మలిస్టు చాపల శ్రీనివాసులు, సరితా దంపతులు కన్యాదానం చేశారు.
Also Read: విద్యార్ధుల ఆరోగ్యంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. ఆ రెండు ట్రస్టులకు అల్పాహార భాద్యతలు..?
కళ్యాణోత్సవ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి ఇన్చార్జి సిడిపిఓ శోభారాణి, మున్సిపల్ చైర్మన్ సునీంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు నిజాముద్దీన్, పద్మ, చంద్రకళ, కావలి శ్రీనివాసులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కళ్యాణోత్సవంలో అల్పాహార దాతలు వాసవి ఎలక్ట్రికల్స్ సోమిశెట్టి రవికుమార్ రమాదేవి దంపతులు, వివాహ భోజన దాతలు ఉప్పల కృష్ణయ్య మర్చంట్ తీగల శ్రీనివాసులు, మంజుల దంపతులు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవంలో నిర్వహించిన సంగీత విభావరి డాక్టర్ నాగమాధురి కార్యక్రమం పలువురిని అలరించాయి.
Also Read: డిజిట్ జనగణన షురూ.. ఆన్ లైన్లో తమ వివరాలను నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి