Food Poison: హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. విద్యార్థులను వైద్య చికిత్స నిమిత్తం కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు.
“బాగ్ లింగంపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాల నుండి ఫుడ్ పాయిజన్ అయ్యి 16 మంది విద్యార్థులు హాస్పిటల్ కు వచ్చారు. రాత్రి వారు తిన్న ఆహారం కలుషితం కావడం వల్ల వాంతులు , విరోచనలు, కడుపునొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. పిడియాట్రిక్ వైద్యులు పిల్లలను పరీక్షించారు. డిఐడ్రేషన్ కారణంగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు అందరి కండిషన్ స్టేబుల్ గా ఉంది. పిల్లలందరికీ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నాము. పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు”- సంతోష్, మెడికల్ సూపరింటెండెంట్, కింగ్ కోఠి హాస్పిటల్
మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. చంద్రనాయక్ తండా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ జరగటంతో 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన గంట తర్వాత విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడ్డారు.
దీంతో విద్యార్థులను కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురైనట్టు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీచర్లు ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు తెలియజేశారు. ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో నానక్ రాం గుడా రెయిన్ బో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం 38 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై హెచ్ఆర్సీకి యూట్యూబ్ ఛానళ్ల ఫిర్యాదు.. ఎందుకంటే..?