E-Paper
Advertisement

Forensic Lab Fire: ఫోరెన్సిక్​ ల్యాబ్​‌ అగ్ని ప్రమాదంలో మరో కీలక మలుపు.. తేల్చిచెప్పిన నిపుణులు

Forensic Lab Fire: ఫోరెన్సిక్​ ల్యాబ్​‌ అగ్ని ప్రమాదంలో మరో కీలక మలుపు.. తేల్చిచెప్పిన నిపుణులు
Advertisement

Forensic Lab Fire: స్వేచ్ఛ బ్యూరో: ఫోరెన్సిక్​ సైన్స్​ లేబోరేటరీ (ఎఫ్​ఎస్​ఎల్​)లో జరిగిన అగ్ని ప్రమాదం మరో మలుపు తీసుకుంది. ఈ దుర్ఘటనలో 11వందల ఫైళ్లు కాలి బూడిదైనట్టు నిపుణులు నిర్ధారించారు. వాటి డేటాను రిట్రైవ్ చేయటం కూడా సాధ్యం కాదని తేల్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాంపల్లి రెడ్ హిల్స్ లో ఉన్న ఎఫ్​ఎస్​ఎల్ లో ఈనెల 7న ఉదయం 10గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంట్లో కంప్యూటర్ ల్యాబ్ తోపాటు హార్డ్​ డిస్కులు, ఫైళ్లు దగ్ధమయ్యాయి. వీటిల్లో ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన వాటితోపాటు ఓటుకు నోటు కేసులోని కీలక పత్రాలు అగ్నికి ఆహుతైనట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రాజకీయ కోణంలో ఆయా పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు.

నేషనల్ ఫైర్ సర్వీసెస్​ కాలేజీ..

ఈ నేపథ్యంలో డీజీపీ శివధర్​ రెడ్డి స్పందిస్తూ ఓటుకు నోటు కేసులోని అన్ని ఆధారాలను ఇప్పటికే కోర్టుకు సమర్పించామని, వాటికి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టంగా ప్రకటించారు. అదే సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కంప్యూటర్ ల్యాబ్​ తోపాటు, కొన్ని హార్డ్​ డిస్కులు, ఫైళ్లు దగ్ధమయ్యాయని చెప్పారు. నాగ్​ పూర్​ లోని నేషనల్ ఫైర్ సర్వీసెస్​ కాలేజీ నుంచి నిపుణులను రప్పిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో సెంట్రల్ ఫోరెన్సిక్​ సైన్స్​ లేబోరేటరీ నిపుణులు వస్తున్నట్టు చెప్పారు. ఈ బృందాలు విచారణ జరిపి ప్రమాదం ఎలా జరిగిందన్నది నిర్ధారించటంతోపాటు డేటాను రిట్రైవ్ చేస్తారన్నారు. ఇక, హైదరాబాద్​ వచ్చిన నాగ్​ పూర్​ స్పెషల్ టీం తాజాగా కీలక వివరాలను వెల్లడించింది. ఎఫ్​ఎస్​ఎల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11వందల ఫైళ్లు కాలి బూడిదైనట్టు తెలిపింది. వాటి డేటాను రికవరీ చేయటం సాధ్యం కాదని తేల్చేస్తూ ఈ మేరకు నివేదికను సమర్పించింది. కాగా, దగ్ధమైన ఫైళ్లలో ఫోన్​ ట్యాపింగ్​ కు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టుగా సమాచారం.

Advertisement

Also Read: Pixel Phones Discount: సగం కన్నా తక్కువ ధరకు గూగుల్ పిక్సెల్ ఫోన్.. అమెజాన్‌లో షాకింగ్ ఆఫర్స్

కేసులపై ప్రభావం..

రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నేరాల పరిశోధనలో ఎఫ్ఎస్​ఎల్ తనదైన పాత్రను పోషిస్తుంది. హత్యలు, దోపిడీలు, మోసాలు, లైంగిక దాడులతోపాటు పలు నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఇక్కడే విశ్లేషించి భద్రపరుస్తారు. నేరాలు జరిగిన చోటు నుంచి సేకరించిన నమూనాలు, సాంకేతిక ఆధారాలను ఈ ల్యాబ్​ లోనే పరీక్షించి నివేదికలు తయారు చేస్తారు. డీఎన్​ఏ టెస్టులు, వేలిముద్రలు, రక్తం, వెంట్రుకల నమూనాలను కూడా ఇక్కడే విశ్లేషించి రిపోర్టులు రూపొందిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో 11 వందల ఫైళ్లు దగ్ధమైనట్టు వెల్లడైన నేపథ్యంలో ఏయే కేసులకు సంబంధించిన ఆధారాలు వాటిల్లో ఉన్నాయన్నది ప్రస్తుతం ప్రశ్నగా మిగిలింది. కాగా, ఆయా కేసులపై ఈ పరిణామం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Also Read: Neknampur Lake: అద్దంలా మెరవనున్న నెక్నామ్ పుర చెరువు.. రూ 99.50 కోట్లతో అభివృద్ధి పనులు

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×