Dharmapuri Sanjay: స్వేచ్ఛ బ్యూరో: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మునూరు కాపు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సన్మానంలో కాలి కుర్చీలకు సన్మానం చేశారు. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్(Dharmapuri Sanjay). ఇటీవల ఎన్నికల్లో గెలిచిన పార్టీలకు అతీతంగా సన్మానం చేయడానికి మునురు కాపు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ను ఒక తాటిపైకి పిలిచారు. అయితే బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఈ సన్మానం కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో మిగితా వారికి సన్మానం చేశాక బీజేపీ(BJP) నుంచి గెలిచిన కార్పొరేటర్లు రాకపోవడంతో వారి పేర్లతో ఉన్న కుర్చీలకు ధర్మపురి సంజయ్ సన్మానం చేసి అసహనం వ్యక్తం చేశారు.
కొంత మంది ఊరును, అన్నదమ్ములను విడదియాలని పని చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదని, జిల్లా అభివృద్ధి కావాలంటే అందరూ కలిసి ఉంటేనే సాధ్యమైతుందని అన్నారు. ధర్మపురి శ్రీనివాస్(Dharmapuri Srinivas) అడుగుజాడల్లో అందరిని కలుపుకునే గుణంతో పని చేస్తున్నాం అని స్పష్టం చేశారు. అందరూ కలిసి రావాలని మునురు కాపు కార్పొరేటర్లు, కౌన్సిలర్ సన్మానం పెడితే ఇలాంటి ధోరణి సరైంది కాదని అన్నారు. దీంతో మరో సారి బీజేపీ పై పార్టీ పేరు చెప్పకనే హాట్ కామెంట్స్ చేశారు ధర్మపురి సంజయ్.