E-Paper
Advertisement

Free Bus: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు.. సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం

Free Bus: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు.. సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం
Advertisement

Free Bus: ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అన్ని చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ఆపరేషన్స్ పై మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హాల్ టికెట్ ఉన్న విద్యార్థులను బస్సులో ఫ్రీగా ప్రయాణించేందుకు అనుమతివ్వాలని ఆదేశించారు.

బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు ఉండడంతో పరీక్షల జరిగే ఉదయం, మధ్యాహ్నం సమయంలో అదనంగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు బస్సులు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్సుల స్టాప్ ఉన్నా లేకున్నా హాల్ టికెట్ ఆధారంగా పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులను దింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి డిపో మేనేజర్ ద్వారా ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లకు తెలియజేయాలని ఆదేశించారు.

Advertisement

Also Read: Indian Restaurant Closure: పాక్ వేధింపులు.. లండన్‌లో మూతపడ్డ భారత రెస్టారెంట్.. యజమాని భావోద్వేగం!

ఈ సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకుని ఎలాంటి మానసిక ఆందోళన చెందకుండా పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్టీసీ ఈడీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: CM Revanth Reddy: పాలకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×