E-Paper
Advertisement

Gachibowli Hotel Owner Murder: పట్టపగలు.. అందరూ చూస్తుండగా, రాడ్‌తో దాడి చేసి..

Gachibowli Hotel Owner Murder: పట్టపగలు.. అందరూ చూస్తుండగా, రాడ్‌తో దాడి చేసి..
Advertisement

Gachibowli Hotel Owner Murder: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. సాయంత్రం దాదాపు ఐదు గంటల సమయం.. అంతా చూస్తుండగా హోటల్‌లోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. డోర్ ఓపెన్ చేయగానే తాను తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో కుర్చీలో కూర్చొన్న శ్రీనివాస్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టాడు. తలకు బలమైన గాయంకావడంతో దాదాపు నాలుగైదు గంటలపాటు మృత్యువుతో పోరాడి మరణించాడు 54 ఏళ్ల శ్రీనివాస్. సంచలనం రేపిన ఈ ఘటన గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో చోటు చేసుకుంది. హత్య వెనుక ఏం జరిగిందనే లోతుల్లోకి వెళ్తే..

యూసుఫ్‌‌‌గూడకు చెందిన శ్రీనివాస్ కొండాపూర్‌లో ఉంటున్నాడు. అంజయ్యనగర్‌లో తన కొడుకుతో కలిసి సీఎస్ డెలాయిట్ ఇన్ పేరిట హోటల్ నిర్వహిస్తున్నాడు. హొటల్ వెనుక స్టోర్ రూమ్ వద్ద పార్కింగ్ విషయమై పక్కనే ఉన్న మహేందర్‌ అనే వ్యక్తితో గొడవపడ్డాడు శ్రీనివాస్. ఈ ఘటన జరిగి చాన్నాళ్లు అయ్యింది.

Advertisement

జనం మధ్యలో తన పరువు తీశాడని భావించి మహేందర్, ఆయనపై కక్ష కట్టాడు. శ్రీనివాస్‌ను ఎలాగైనా  చంపాలని పగతో రగిలిపోయాడు.. అందుకు ప్లాన్ ప్రకారం స్కెచ్ వేశాడు. సరిగ్గా గురువారం సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషాల సమయంలో హొటల్‌లోకి ప్రవేశించిన మహేందర్.. సోఫాలో కూర్చొన్న శ్రీనివాస్‌పై రాడ్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు.

Also Read: వడదెబ్బతో ఆరుగురు మృతి..! నేడు కూడా రాష్ట్రంలో..

Advertisement

అక్కడేఉన్న శ్రీనివాస్ కొడుకు కేశవ్, హోటల్ సిబ్బంది మహేందర్‌ను అడ్డుకున్నారు. శ్రీనివాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చివరకు రాత్రి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు కేశవ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడు మహేందర్ ఎంబీఏ చదివాడు. ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉంటున్నాడు. ఉద్యోగం చేసుకోవాలని పేరెంట్స్ పలుమార్లు చెప్పారు కూడా. చివరకు కోపం, పగ కారణంగా మహేందర్‌ నిందితుడైపోయాడు.

Tags

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×