BigTV English

Telangana Speaker : గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా ఎన్నిక.. ఏకగ్రీవం..

Telangana Speaker :  గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా ఎన్నిక.. ఏకగ్రీవం..

Telangana Speaker : తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికయ్యారు.
స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసే సరికి ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికను గురువారం ప్రొటెం స్పీకర్‌ ప్రకటిస్తారు.


శాసన సభ కార్యదర్శికి బుధవారం ఉదయం ప్రసాద్ కుమార్ నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. కేటీఆర్ వచ్చి నామినేషన్ పత్రంపై సంతకం చేశారు. స్పీకర్ ఎన్నికకు ఒక్కటే నామినేషన్ రావడంతో గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్.. రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న గడ్డం ప్రసాద్.. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్‌ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌ లలో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో స్పీకర్‌ పదవిని దళిత నేతకు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×