Gas Protest: స్వేచ్ఛ బ్యూరో: నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని జయశ్రీ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ బుకింగ్ చేసుకున్న, ఖాళీ గ్యాస్ కుండలతో ఏజెన్సీ గోడౌన్ వద్దకు వచ్చిన గ్యాస్ పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహిస్తూ బుధవారం వినియోగదారులు వేములపల్లి మండల కేంద్రం శివారులో అద్దంకి నార్కెట్ పల్లి ప్రధాన రహదారిపై సుమారు గంటన్నరకు పైగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు మాట్లాడారు.
తాము గ్యాస్ బుకింగ్ చేసినప్పటికి ఓటీపీ రావట్లేదని, ఈకేవైసీ తో పాటు ఇతర రసాకులతో గ్యాస్ ను డెలివరీ చేయడం లేదని ఆరోపించారు. సుమారు రెండు రోజులుగా జయశ్రీ గ్యాస్ ఏజెన్సీ వద్దనే ఉన్నప్పటికీ సంబంధిత యాజమాన్యం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. గ్యాస్ ఇచ్చేవరకు ధర్నా విరమించేది లేదని రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నా వద్దకు చేరుకొని సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు.
Also read: కరీంనగర్ మీ జాగీరు కాదు.. బరాబర్ వస్తాం.. బండికి గంగుల స్ట్రాంగ్ కౌంటర్
గ్యాస్ పంపిణీ విషయంలో కస్టమర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అధికారుల దృష్టికి వస్తున్నప్పటికీ పట్టించుకోవడంలేదని కస్టమర్లు మండిపడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ సిబ్బంది నుంచి డెలివరీ బాయ్స్ వరకు ఏ ఒక్కరూ తమకు రెస్పాన్స్ కావడం లేదని గ్యాస్ అయిపోయి ఇబ్బందులు పడుతున్న బుకింగ్ చేసుకున్న గ్యాస్ ఎప్పటి వరకు డెలివరీ చేస్తారన్న సమాచారాన్ని సైతం ఇవ్వటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గ్యాస్ ఏజెన్సీని రద్దు పరచి కస్టమర్లకు నాణ్యమైన సేవలందించే వారికి గ్యాస్ ఏజెన్సీలను ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
Also read: నోరు అదుపులో పెట్టుకో కేటీఆర్.. మంత్రి పొన్నం మాస్ వార్నింగ్!