E-Paper
Advertisement

GHMC News: హైదరాబాద్‌వాసులకు కబురు.. వన్ టైమ్ స్కీమ్ కొనసాగింపు, రేపోమాపో వారికి నోటీసులు

GHMC News: హైదరాబాద్‌వాసులకు కబురు.. వన్ టైమ్ స్కీమ్ కొనసాగింపు, రేపోమాపో వారికి నోటీసులు
Advertisement

GHMC News: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు చల్లని కబురు చెప్పింది జీహెచ్ఎంసీ. గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై వన్ టైమ్ సెటిల్‌మెంట్-OTS పథకం కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ పథకం కింద పెండింగ్ బకాయిలను చెల్లించే వారికి వడ్డీలో 90 శాతం మాఫీ కానుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది. 

Advertisement

గ్రేటర్ వాసులకు జీహెచ్ఎంసీ తీపి కబురు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పన్ను వసూళ్లపై ఫోకస్ పెట్టారు. గతేడాది జీహెచ్ఎంసీ పరిధి చిన్నది కావడంతో ఆస్తి పన్ను వసూళ్లలో టార్గెట్ దాదాపుగా రీచ్ అయ్యింది. ఈసారి నగర శివారులోని 27 మున్సిపాలిటీలు విలీనం చేయడంతో ఈసారి పన్ను వసూలు మూడు వేల కోట్ల రూపాయలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

డిసెంబర్ నాటికి కేవలం 1550 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు అయ్యింది. ఇంకా 1450 కోట్ల రూపాయలు వసూలు కావాల్సివుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రకటన చేసింది. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద పన్ను చెల్లించినవారికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 90 శాతం మాఫీ కానుంది. పూర్తి ప్రిన్సిపల్ మొత్తానికి కేవలం 10 శాతం వడ్డీ చెల్లిస్తే చాలు.

వన్ టైమ్ స్కీమ్ కొనసాగింపు, రేపోమాపో వారికి నోటీసులు

మిగతా 90 శాతం వడ్డీ పూర్తిగా మాఫీ అవుతుంది. చాలా రోజులుగా ఇంటి బకాయిలను చెల్లించనివారికి ఇదొక తీపికబురు అన్నమాట. ఈ స్కీమ్ ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లోవున్న పన్ను బకాయిలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. నగరవాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి సహకరించాలని GHMC విజ్ఞప్తి చేసింది.

గ్రేటర్ సిటీలో చాలామంది బడాబాబులు ఆస్తి పన్ను కట్టడం లేదని అధికారులు గుర్తించారు. రేపో మాపో వారికి నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. చాలామంది ఏళ్ల తరబడి పన్ను కట్టలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ పరిధిలోని జోన్ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.

ALSO READ: బీఆర్ఎస్ ఈసారి పక్కాగా ప్లాన్.. వైసీపీతో కలిసి బరిలోకి

గతంలో ఆస్తి పన్ను నేరుగా వినియోగదారుల నుంచి వసూలు అధికారులు చేసేవారు. చాలామంది అధికారులు ఆ నిధులతో వడ్డీ వ్యాపారాలు చేశారట. ఈ నేపథ్యంలో పాత పద్దతిని తొలగించి, ఆన్‌లైన్ ద్వారా చెల్లించే పద్దతికి శ్రీకారం చుట్టింది జీహెచ్ఎంసీ. అందుకోసం MyGHMC యాప్, మీ సేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు-CSCs, ఆన్‌లైన్ విధానాల ద్వారా పన్ను చెల్లించవచ్చు.

 

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×