E-Paper
Advertisement

10th Exam Paper Leak: రాయితో బెదిరించాడు.. అందుకే చూపించా.. పేపర్ లీక్‌లో బిగ్ ట్విస్ట్

10th Exam Paper Leak: రాయితో బెదిరించాడు.. అందుకే చూపించా.. పేపర్ లీక్‌లో బిగ్ ట్విస్ట్
Advertisement

ఆకతాయిలు చేసిన పనికి తన భవిష్యత్‌ను బలి చేయొద్దని వేడుకుంటోంది నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన టెంత్‌ విద్యార్థిని బల్లెం ఝాన్సీ లక్ష్మీ. టెంత్‌ పేపర్‌ లీక్‌ ఘటనకు తనను నిందిస్తూ.. పోలీసులు వేధించారని.. తన భవిష్యత్‌ ప్రశ్నార్థకం చేస్తూ.. తనను ఎగ్జామ్‌ నుంచి డిబార్‌ చేశారని ఆరోపిస్తోంది. ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న తనను బెదిరించి ప్రశ్నా పత్రాన్ని ఫోటో తీసుకున్నారని తెలిపింది. క్వశ్చన్ పేపర్ చూపించు.. లేకుంటే రాయితో కొడతామని బెదిరించి, క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారని తెలిపింది. ఆ సమయంలో నాకు భయం వేసి.. ఏం చేయాలో అర్థం కాక పేపర్ చూపించానని తెలిపింది.

Advertisement

ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని.. దయచేసి నా డిబార్‌ను రద్దు చేయాలని వేడుకుంది. ఎగ్జామ్‌కు అనుమతించకపోతే.. తనకు ఆత్మహత్యే శరణ్యమని విద్యార్థిని ఝాన్సీ లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. నేను క్లవర్ స్టూడెంట్‌ని.. నాకు ఎక్కడ ఎగ్జామ్ రాపిచ్చిన నేను రాస్తాను.. చూసి రాయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరో చేసిన దానికి నన్ను బలి చేశారు.. దయచేసి ఎగ్జాం రాసే అవకాశం మళ్ళీ కల్పించాలని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం నకిరేకల్ జడ్పీహెచ్ స్కూల్‌లో పేపర్ లీక్ అయిన ఘటన అందరికి తెలిసిందే. ఈ పరిణామంలో విద్యార్ధిని ఝాన్సీని డీ బార్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో తనకు ఏ పాపం తెలియదంటూ ఝాన్సీ, తన కుటుంబ సభ్యులు కూడా వాపోతున్నారు.

Advertisement

Also Read: పరకామణిలో చోరీ వివాదం.. మరోమారు తెరపైకి..

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. మార్చి 21న విద్యార్థులు తెలుగు పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. అయితే పరీక్షలు స్టార్ట్ అయిన మొదటిరోజే పేపర్ లీకేజ్ తో గందరగోళం నెలకొంది. నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని ZPH స్కూల్ ఇన్విజిలేటర్ తెలుగు పేపర్ లీక్ చేసినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఇన్విజిలేటర్ ని విధుల నుంచి తొలగించారు. అలాగే సెంటర్ లోని మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా.. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఓ ఝాన్సీ అనే విద్యార్థిని డీబార్ కూడా చేశారు.

 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×