E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

భూమిలో పండుతున్న బంగారం.. వరంగల్ జిల్లాలోని ఆ ఆరు ఎకరాల మిస్టరీ ఏంటి?

భూమిలో పండుతున్న బంగారం.. వరంగల్ జిల్లాలోని ఆ ఆరు ఎకరాల మిస్టరీ ఏంటి?
Advertisement

Warangal Gold: తెలంగాణలోని ఒక సాధారణ గ్రామంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. “ఆ భూమిలో బంగారం పండుతోంది!” అవును, మీరు విన్నది నిజమే. ఎకరా భూమి కౌలుకు దొరికితే చాలు మహాప్రసాదం అనుకునే రోజుల్లో.. ఒక నిర్దిష్టమైన ఆరు ఎకరాల పొలం కోసం పోటీ పడుతూ, “మాకంటే మాకు కౌలుకివ్వండి” అంటూ రైతులు యజమాని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకీ ఆ భూమిలో అంతటి అద్భుతం ఏం జరిగింది? అక్కడ నిజంగానే బంగారం దొరుకుతుందా? అనే ఆసక్తికర విశేషాలు..

అసలేం జరిగిందంటే..?
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలోని ఒక ఆరు ఎకరాల పొలమే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకు చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈర్యతండాకు చెందిన ఒక రైతు దీనిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు. ఇటీవల జూన్ 24వ తేదీన ఆ పొలంలో మహిళా కూలీలు కలుపు తీస్తుండగా.. అనూహ్యంగా వారికి కొన్ని పురాతన బంగారు ఆభరణాలు లభించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న భూ యజమాని కూలీలను పిలిపించి విచారించగా, వారు దొరికిన బంగారాన్ని చూపించారు. దీంతో యజమాని వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

ఈ నిధుల వెనుక పెద్ద చరిత్రే ఉంది!
ఈ ప్రాంతంలో బంగారం దొరకడం ఇదే మొదటిసారి కాదని స్థానికులు చెబుతున్నారు. పూర్వం ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద ఆలయాలు ఉండేవని, అందుకే ఇక్కడ గుప్తనిధులు ఉన్నాయనే నమ్మకం బలంగా ఉంది. గతంలో 1991లో అప్పటి భూ యజమానికి కూడా కొంత బంగారం లభించిందట. ఆ తర్వాత కొన్నేళ్లకు అదే పొలంలో పనిచేసే ఒక జీతగాడికి కూడా పసిడి దొరికినట్లు గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు, గతంలో ఇక్కడ కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా బయటపడ్డాయి. ఈ చారిత్రక నేపథ్యం వల్లే ఈ భూమి చుట్టూ ఇప్పుడు ‘బంగారు’ అంచనాలు పెరిగిపోయాయి.

పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ.. రాత్రి వేళల్లో వేట!
బంగారం దొరికిందనే వార్త దావానలంలా వ్యాపించడంతో ఈ కథ సరికొత్త మలుపు తిరిగింది. దొరికిన బంగారాన్ని పంచుకున్న వారిపై చర్యలు తీసుకుని, ఆ నిధిని తమకు అప్పగించాలని.. ఆ భూమిని మొదట విక్రయించిన వ్యక్తి కుమారుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ పొలంలో కనకం దొరుకుతుందనే ఆశతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో ఆ భూమి పరిసరాల్లో రహస్యంగా సంచరిస్తున్నారు. ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా పండుతుందోనని జనం అక్కడ నిఘా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘బంగారు భూమి’ వ్యవహారం అటు పోలీసులకు, ఇటు రెవెన్యూ అధికారులకు పెద్ద సవాలుగా మారింది.

Advertisement

Also Read: వారెవ్వా పసిడి.. దిగొచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు ఖుషీ ఖుషీ!

Related News

విద్యార్థులకు తీపి కబురు.. ఇకపై ప్రతి నెలా రూ.250 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్!

తెలంగాణలో అన్నదాతలకు శుభవార్త.. రైతు భరోసా నిధులు విడుదల, బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవచ్చు

HCA Notice: క్రికెటర్ గౌరవ్ శర్మ ఫిర్యాదుతో కదిలిన బీసీసీఐ.. అసలు దందా బట్టబయలు..?

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాదే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధీమా

జూలై 10న ఎన్నికల పోలింగ్.. రంగంలోకి దిగిన ఆఫీసర్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

RTC Elections: ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

Huzurabad Bhavan: కోటి రూపాయలు ఇచ్చినా పిల్లర్లకే పరిమితం.. హుజూరాబాద్‌లో దారుణం!

Big Stories

×