E-Paper
Advertisement

ఇంటర్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన నిరుపేద విద్యార్థిని..!

ఇంటర్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన నిరుపేద విద్యార్థిని..!
Advertisement

State Topper: స్వేచ్ఛ బ్యూరో: కడుపేద కుటుంబం తండ్రి లేని పరిస్థితి ప్రభుత్వ పాఠశాలే ఆధారం అయినా పట్టుదలతో చదివి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది కమలాపూర్ మండలానికి చెందిన కోరే వైష్ణవి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల (ఎం.జె.పి) పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న కోరే వైష్ణవి 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన వైష్ణవి చిన్నప్పటి నుంచే కష్టాలను ఎదుర్కొంటూ చదువులో ప్రతిభ కనబరిచింది. తండ్రి లేకపోయినా తల్లి సంధ్యారాణి కష్టపడి చదివించగా వైష్ణవి పట్టుదలతో ఈ ఘనత సాధించింది.

గ్రామంలో హర్షం..

వైష్ణవి పదవ తరగతిని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పూర్తి చేసి ప్రస్తుతం ఎం.జె.పి బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం పట్ల గ్రామంలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ వైష్ణవిని అభినందించి నగదు ప్రోత్సాహం అందజేశారు. కష్టపడి చదివి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కడుపేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థిని రాష్ట్ర ప్రథమంగా నిలవడం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నిదర్శనమని పేర్కొన్నారు.

Advertisement

Also read: న‌వ్వుతూ.. వెక్కిరిస్తూ… ! ప్రియాంక ప్ర‌సంగానికి పార్ల‌మెంటు ఫిదా…

కురుమ సంఘం సభ్యులు 

అదేవిధంగా కురుమ సంఘం సభ్యులు వైష్ణవిని శాలువాతో సత్కరించి నగదు ప్రోత్సాహం అందించారు. ఒకటో వార్డు సభ్యురాలు మార్క సరిత వైష్ణవిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు, గ్రామస్తులు వైష్ణవిని అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కష్టాలను అధిగమించి పట్టుదలతో చదివితే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని వైష్ణవి మరోసారి నిరూపించింది.

Advertisement

Also read: ఫుట్ పాత్ పై సర్కార్ సీక్రెట్ ఆపరేషన్.. మార్కింగ్ పడితే కూల్చివేత పక్కా..!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×