Rithika: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ పాఠశాల విద్యార్థి రితిక(Rithika) అరుదైన ఘనత సాధించింది. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేకుండా ప్రతిరోజూ పాఠశాలకు హాజరవుతోంది. వరుసగా రెండో ఏడాది కూడా ఒక్క ఆబ్సెంట్ లేకుండా ప్రతిరోజూ పాఠశాలకు వెళ్తోంది. సాధారణంగా చిన్న పిల్లలు రోజూ బడికి వెళ్లాలంటే ఏదో ఒక కారణంతో తప్పిస్తుంటారు. కానీ జనగామ జిల్లా నర్మెట్ట మండలం మాన్ సింగ్ తండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న కే రితిక గత విద్యాసంవత్సరంలో వంద శాతం హాజరు నమోదు చేసుకుంది. ఈ విద్యాసంవత్సరం కూడా ఇప్పటి వరకు ఒక్క రోజూ పాఠశాలకు రాకుండా ఉన్న దాఖలాల్లేవు.
Also Read: Bhatti Vikramarka: రాహుల్ గాంధీ ప్రధాని అయితే వాటంన్నిటికి పరిష్కారం..?
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు చూసే ఈ రోజుల్లో అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ వంద శాతం హాజరవ్వడంపై టీచర్లు, పలువురు అధికారులు విద్యార్థిని రితికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే రితిక సోదరి కూడా ఇదే పాఠశాలలో గత విద్యాసంవత్సరంలో ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా వంద శాతం హాజరైంది. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు ఒక్కరోజు మాత్రమే జ్వరం కారణంగా గైర్హాజరైంది. మొత్తానికి ఇద్దరు అక్కా.. చెల్లెలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.