E-Paper
Advertisement

Half-day schools: విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

Half-day schools: విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
Advertisement

Half-day schools: తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండడంతో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఎల్లుండి నుంచి విద్యా సంవత్సరం ముగిసేవరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు మార్నింగ్ 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పనిచేస్తాయని వివరించింది. స్కూళ్లో పిల్లలకు మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం అందించి ఇంటికి పంపనున్నారు.

Advertisement

టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలకు స్టూడెంట్స్ ను సన్నద్ధం చేసేందుకు స్పెషల్ క్లాసెస్ కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. ఎస్ఎస్‌సీ పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూళ్లు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో చివరి రోజు ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. ఆదేశాలను అన్ని మేనేజ్‌మెంట్లు అమలు పరిచేలా పాఠశాల విద్యాశాఖ రీజినల్‌ జాయింట్ డైరెక్టర్‌లు, జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

ALSO READ: BANK OF BARODA: గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడగింపు

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×