E-Paper
Advertisement

Yadadri Temple: హరీశ్ రావు పాప ప్రక్షాళన పూజ వివాదాస్పదం

Yadadri Temple: హరీశ్ రావు పాప ప్రక్షాళన పూజ వివాదాస్పదం
Advertisement

Harish Rao: రుణమాఫీ పేరు చెప్పి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. దేవుళ్లపై ఒట్టేసి మరీ సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఈ హామీ ఇచ్చారని చెప్పారు. దేవుళ్లపై ఒట్టేసి ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకోలేదని వివరించారు. ఇది ఆయనకే కాదు.. రాష్ట్రానికి కూడా అరిష్టం అని చెప్పారు. ఆ అరిష్టం తగలకుండానే తాను ఆ దేవుళ్ల ఆలయాలకు వెళ్లి పాప ప్రక్షాళన పూజ చేస్తామని వివరించారు. ఈ రోజు ఉదయం మాజీ మంత్రి హరీశ్ రావు యాదాద్రి ఆలయానికి వెళ్లి పాప ప్రక్షాళన పూజ చేశారు.

అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, కాబట్టి, ఆయనకు ఏమీ జరగకూడదని తాము పూజలు చేస్తున్నామని వివరించారు. ఇలా దేవుడిపై ఒట్టేసి మాట తప్పితే ఆ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అరిష్టమని తనకు కొందరు బ్రాహ్మణులు చెప్పారని, అందుకే ఈ పాప ప్రక్షాళన పూజ చేస్తున్నామని తెలిపారు.

Advertisement

అయితే, హరీశ్ రావు చేసిన ఈ పాప ప్రక్షాళన పూజ వివాదాస్పదమైంది.త మాడవీధుల్లో పాప ప్రక్షాళన పూజలు చేయరాదని, ఇది ఎండోమెంట్ సెక్షన్ 7 కింద నేరమని ఆలయ అధికారులు తెలిపారు. యాదగిరి కొండలు పవిత్రమైనవని, ఇక్కడ ఎలాంటి రాజకీయ, ఇతర మత కార్యక్రమాలు చేపట్టరాదని చెప్పారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయని ఆలయ ఈవో తెలిపారు. అందుకే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతలు ఇక్కడ పూజలు నిర్వహించినట్టు, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: Congress Govt: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ సంగతేంటి?: కేటీఆర్

Advertisement

ఇదిలా ఉండగా.. హరీశ్ రావు పాప ప్రక్షాళన పూజలకు కౌంటర్‌గా కాంగ్రెస్ నాయకులు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టారు. మాడవీధులను శుభ్రం చేసి బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×