Weather Alert: తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లో ఇప్పటికే ఎండలు మండి పోతున్నాయి. ఎండల కారణంగా ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరన శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే రెండు నుండి మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా ముందుకు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాణ తెలిపింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో తేలిక పాటి వర్షాలు మోస్తరు వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అంకాశం ఉందని వాతావరణ శాణ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరియు ఉత్తరం దిక్కున ఉన్న తూర్పు జిల్లాలో తీవ్రమైన వడగాలు ఆ ప్రాత ప్రజలు అప్పమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
Also Read: శంషాబాద్లో రూ.1000 కోట్ల భూ స్కామ్.. ప్రభుత్వ పెద్దలపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు!
భారత వాతావరణ శాఖ (IMD) దేశవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. ఉత్తర భారత దేశంలో ఎండల వీవ్రత ఇప్పడికే మండి పోతుండగా, దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు రాష్ట్రాల జాబితా ఇక్కడ ఉంది. ఉత్తర, మధ్య భారతదేశంలో రాబోయే మూడు నుండి నాలుగు రోజులు ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా వేడిగా నమోదవుతాయని వాతావరణ శాణ తెలిపింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, పాండిచ్చెరి, పుదుచ్చెరి, పశ్చిమ బెంగాల్, సిక్కిం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: కర్ణాటకలో కాంగ్రెస్ కుర్చీ పంచాయితీ.. సీఎం సీటు కోసం కుమ్ములాటలు!