E-Paper
Advertisement

హైదరాబాద్‌లో హెచ్ ఫాస్ట్ దాడులు.. 7 టన్నుల మామిడి పండ్లు స్వాధీనం

హైదరాబాద్‌లో హెచ్ ఫాస్ట్ దాడులు.. 7 టన్నుల మామిడి పండ్లు స్వాధీనం
Advertisement

హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న నకిలీ పండ్ల దందా బట్టబయలైంది. కృత్రిమ పద్ధతుల్లో పండ్లను మక్కబెడుతున్నారనే పక్కా సమాచారంతో హెచ్ ఫాస్ట్ (H-FAST) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున రసాయనాలు ఉపయోగించి పండించిన మామిడి పండ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న ఈ గోదాంను అధికారులు సీజ్ చేశారు.

ఆసిఫ్‌నగర్ పరిధిలోని ఒక రహస్య గోదాంలో మామిడి పండ్లను సహజ సిద్ధంగా కాకుండా ప్రమాదకరమైన రసాయనాలతో పండిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హెచ్ ఫాస్ట్ బృందం గోదాంపై విరుచుకుపడింది. అక్కడ నిల్వ ఉంచిన సుమారు 7 టన్నుల మామిడి పండ్లను చూసి అధికారులు విస్తుపోయారు. పండ్లను త్వరగా పండించేందుకు నిషేధిత మోతాదులో ‘ఇథలీన్’ రసాయనాన్ని వాడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఇక్కడ పండించిన పండ్లను నగరం అంతటా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

Advertisement

గోదాంలో మొత్తం 350 ట్రేల మామిడి పండ్లు ఉండగా ప్రతి ట్రేలో సుమారు 20 కేజీల పండ్లు ఉన్నాయి. వీటిని బాటాసింగారం మార్కెట్ నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. మార్కెట్ ధర కంటే ఎక్కువ లాభాలు పొందడానికి పండ్లకు రసాయనాలు పూసి రంగు వచ్చేలా చేస్తున్నారు. ఈ పండ్లు తింటే ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడుతున్న నిర్వాహకులు జమీల్ ఫరీద్‌లపై కఠిన చర్యలు చేపట్టారు.

ప్రస్తుతం ఆ గోదాంను అధికారులు పూర్తిగా సీజ్ చేశారు. పట్టుబడిన పండ్లను స్వాధీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. మార్కెట్లలో కొనుగోలు చేసేటప్పుడు పండ్లు సహజ రంగులో ఉన్నాయో లేదో గమనించాలని వినియోగదారులకు సూచించారు. అక్రమ సరఫరాదారుల గొలుసుకట్టును తెంచేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తామని హెచ్ ఫాస్ట్ బృందం ప్రకటించింది.

Advertisement

ALSO READ: పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. తెలంగాణ తరహా సంక్షేమం.. భట్టి విక్రమార్క హామీ

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×