E-Paper
Advertisement

Cyber Crime Police: డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్ల మోసం.. 104మంది అరెస్ట్.. భారీగా నగదు సీజ్​

Cyber Crime Police: డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్ల మోసం.. 104మంది అరెస్ట్.. భారీగా నగదు సీజ్​

Cyber Crime Police: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ; సైబర్ క్రిమినల్స్​ కు చెక్​ పెట్టే దిశలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు భారీ విజయం సాధించారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో ఆక్టోపస్​ పేర ఆపరేషన్​ జరిపి 104మందిని అరెస్ట్​ చేశారు.వీరిలో మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, బ్యాంక్​ ఖాతాల సరఫరాదారులతోపాటు కొందరు బ్యాంక్​ అధికారులు కూడా ఉండటం గమనార్హం. సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవలిగా ఇన్వెస్ట్ మెంట్​, ట్రేడింగ్​ ఫ్రాడ్​ లతోపాటు డిజిటల్ అరెస్ట్​ వంటి నేరాలు వరుసగా జరుగుతున్న విషయం తెలిసిందే. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలంటూ ఆశ పెట్టి కొందరినీ…మీపై తీవ్రమైన నేరారోపణల మీద కేసులు నమోదయ్యాయి…డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ మరికొందరిని భయపెట్టి సైబర్​ క్రిమినల్స్​ లక్షల రూపాయలు లూటీ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 32 బృందాలుగా విడిపోయి ఆక్టోపస్​ పేర స్పెషల్ ఆపరేషన్​ ప్రారంభించారు.

Also Read:Women’s T20 World Cup 2026: టీమిండియా, పాక్ మ‌ధ్య మ‌రో మ్యాచ్‌..ఎప్పుడంటే

మొత్తం 104మందిని అదుపులోకి

మొదట బాధితుల నుంచి కొల్లగొట్టిన డబ్బును మళ్లించటానికి ఉపయోగించిన 151 బ్యాంక్​ ఖాతాలను గుర్తించారు. ఏయే రాష్ట్రాల్లో ఆ అకౌంట్లు ఉన్నాయో నిర్ధారించుకున్నారు. అనంతరం ఏకకాలంలో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్​, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు జరిపారు. పదిరోజులపాటు సాగించిన ఈ దాడుల్లో మొత్తం 104మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కమీషన్లు తీసుకుంటూ తమ అకౌంట్లలో జనం నుంచి కొల్లగొట్టిన డబ్బును జమ చేయటానికి అప్పగించిన 86మంది మ్యూల్ అకౌంట్​ హోల్డర్లు ఉన్నారు. ఇక, సైబర్​ క్రిమినల్స్​ కు అకౌంట్లను సప్లయ్​ చేస్తున్న వారు అగ్రిగేటర్లు 17మందిని పట్టుకున్నారు.

మొత్తం 127 కోట్ల

సైబర్ కేటుగాళ్లతో కుమ్మక్కై నకిలీ ఖాతాలు తెరవటానికి సహకరించిన బంధన్​ బ్యాంక్​ రిలేషిన్​ షిప్​ మేనేజర్​ ను కూడా అరెస్ట్​ చేశారు. విచారణలో అరెస్టయిన ఈ నిందితులకు దేశవ్యాప్తంగా 1,055 సైబర్​ నేరాల్లో సంబంధం ఉన్నట్టుగా వెల్లడైంది. ఈ మోసాల్లో మొత్తం 127 కోట్ల రూపాయలను బాధితులు పోగొట్టుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఇక, అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 2‌‌04 మొబైల్ ఫోన్లు, 141 సిమ్​ కార్డులు, 152 బ్యాంక్​ పాస్​ బుక్కులు, 234 డెబిట్/క్రెడిట్​ కార్డులు, 26 ల్యాప్​ టాప్ లు, కార్పోరేట్ సంస్థల పేర తయారు చేసిన 56 రబ్బర్ స్టాంపులు, 36లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్​ ను స్పెషల్ బ్రాంచ్​ జాయింట్ సీపీ ఎస్.ఎం.విజయ్​ కుమార్​, సైబర్​ క్రైం డీసీపీ అరవింద్ బాబు పర్యవేక్షించారు. ఇక, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్​, డిటెక్టీవ్​ ఇన్స్​ పెక్టర్లు, ఆర్మ్​ డ్​ రిజర్వ్​ డ్​ సిబ్బంది ఆపరేషన్ లో పాల్గొన్నారు. వీరందరిన కమిషనర్​ వీ.సీ.సజ్జనార్ అభినందించారు.

Also Read: Komali Death: కోమలి సూసైడ్‌కి ముందు అసలు ఏం జరిగింది?.. ఆత్మహత్యకు కారణం ఇదేనా?

Related News

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

Big Stories

×