BigTV English

Hyd Gold Man In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హైదరాబాద్ గోల్డ్ మ్యాన్.. బంగారం చూసి అంతా షాక్

Hyd Gold Man In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హైదరాబాద్ గోల్డ్ మ్యాన్.. బంగారం చూసి అంతా షాక్

Hyd Gold Man In Tirumala: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం అధికంగా కనిపించింది. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల భక్తులతో నిండిపోయింది. 2025 ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరుగుతున్న సందర్భంగా, స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షం కోసం భక్తులు అలిపిరి కాలినడక మార్గాన సైతం తిరుమలకు చేరుకుంటున్నారు. టిటిడి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది.


కాగా తెలంగాణకు చెందిన గోల్డ్ మ్యాన్ విజయ్ కుమార్ కొండ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెడలో సుమారు 5 కేజీల విలువైన బంగారు ఆభరణాలను ధరించిన విజయ్ కుమార్, శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు రాగానే భక్తులు ఆయనను ఆసక్తిగా చూశారు. కొంతమంది గోల్డ్ మ్యాన్ తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.

అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీవారి దర్శన భాగ్యం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మెడలో బంగారు ఆభరణాలు ధరించడం తనకు అలవాటుగా మారిందన్నారు. అనంతరం సెల్ఫీలు అడిగిన భక్తులకు విజయ్ కుమార్ వారి కోరిక మేరకు సెల్ఫీలు ఇచ్చారు.


జ‌న‌వ‌రి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించ‌నున్నారు.

నంద‌లూరు శ్రీ సౌమ్యనాథ‌స్వామివారి ఆలయంలో…
అన్నమయ్య జిల్లా నంద‌లూరు మండల కేంద్రంలోని శ్రీ సౌమ్యనాథ‌స్వామివారి ఆలయంలో జనవరి 10న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా ఆల‌యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉద‌యం 5 గంట‌లకు ఉత్తర ద్వారా ద‌ర్శనం, ఉద‌యం 8.30 గంట‌ల‌కు ల‌క్ష తుల‌సీ అర్చన‌ నిర్వహించ‌నున్నారు. జ‌న‌వ‌రి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8.45 గంట‌ల‌కు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. జ‌న‌వ‌రి 13న గోదా క‌ల్యాణం, జ‌న‌వ‌రి 15న పార్వేట ఉత్సవం జ‌రుగ‌నుంది.

Also Read: South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన మీకోసమే!

ఆవుల‌ప‌ల్లి శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వర‌స్వామివారి ఆలయంలో…
చిత్తూరు జిల్లా సోమల మండలంలోని ఆవుల‌ప‌ల్లి శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వర‌స్వామివారి ఆలయంలో జనవరి 10న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా ఆల‌యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉద‌యం 3 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై జ‌రుగ‌నుంది. అనంత‌రం ఉద‌యం 5 నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌ను స‌ర్వద‌ర్శనానికి అనుమ‌తిస్తారు. రాత్రి 7 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు స్వామి అమ్మవార్లు తిరుచ్చిపై విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్రహించ‌నున్నారు.

Tags

Related News

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Big Stories

×