E-Paper
Advertisement

నీ స్థాయి ఎంత? నీ బతుకెంత?.. కేటీఆర్‌పై మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు!

నీ స్థాయి ఎంత? నీ బతుకెంత?.. కేటీఆర్‌పై మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు!
Advertisement

Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ఒక్కసారిగా సెగలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ‘నీ స్థాయి ఎంత? నీ బతుకెంత?’ అంటూ ఆయన వాడిన పదజాలం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.

మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా రాహుల్ గాంధీ కుటుంబాన్ని వెనకేసుకొస్తూ కేటీఆర్ మీద విరుచుకుపడ్డారు. దేశం కోసం ప్రాణాలర్పించిన, ఆస్తులు త్యాగం చేసిన నెహ్రూ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. మోతిలాల్ నెహ్రూ నుంచి జవహర్‌లాల్ నెహ్రూ వరకు స్వాతంత్ర్య పోరాటంలో వారి పాత్రను గుర్తు చేస్తూ.. అటువంటి గొప్ప చరిత్ర ఉన్న కుటుంబంపై విమర్శలు చేయడం కేటీఆర్ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.

Advertisement

Also Read: నా కోసం జనాన్ని ఆపకండి.. పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం

ఇక వ్యక్తిగత విమర్శల విషయానికి వస్తే.. కేటీఆర్ గతాన్ని మహేష్ కుమార్ గౌడ్ చాలా ఘాటుగా ప్రస్తావించారు. ‘అమెరికాలో పెట్రోల్ బంకుల్లో పని చేసుకునే స్థాయి నుంచి వచ్చిన నువ్వు.. ఇవాళ ఇంతలా మాట్లాడుతున్నావా?’ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నావని ప్రశ్నిస్తూనే.. ‘చీమలు పెట్టిన పుట్టలో పాముల్లా వచ్చి చేరారు’ అంటూ బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తెలంగాణ కోసం పోరాడింది ఒకరైతే, అధికారాన్ని అనుభవించింది మరొకరనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. కేటీఆర్ తన గతాన్ని, తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. మొత్తం మీద మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మార్చాయి.

Also Read: కొండాయికి ‘సీతక్క’ భరోసా.. వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, రూ. 16 కోట్లతో అభివృద్ధి పనులు!

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×