Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ఒక్కసారిగా సెగలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ‘నీ స్థాయి ఎంత? నీ బతుకెంత?’ అంటూ ఆయన వాడిన పదజాలం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.
మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా రాహుల్ గాంధీ కుటుంబాన్ని వెనకేసుకొస్తూ కేటీఆర్ మీద విరుచుకుపడ్డారు. దేశం కోసం ప్రాణాలర్పించిన, ఆస్తులు త్యాగం చేసిన నెహ్రూ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. మోతిలాల్ నెహ్రూ నుంచి జవహర్లాల్ నెహ్రూ వరకు స్వాతంత్ర్య పోరాటంలో వారి పాత్రను గుర్తు చేస్తూ.. అటువంటి గొప్ప చరిత్ర ఉన్న కుటుంబంపై విమర్శలు చేయడం కేటీఆర్ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.
Also Read: నా కోసం జనాన్ని ఆపకండి.. పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం
ఇక వ్యక్తిగత విమర్శల విషయానికి వస్తే.. కేటీఆర్ గతాన్ని మహేష్ కుమార్ గౌడ్ చాలా ఘాటుగా ప్రస్తావించారు. ‘అమెరికాలో పెట్రోల్ బంకుల్లో పని చేసుకునే స్థాయి నుంచి వచ్చిన నువ్వు.. ఇవాళ ఇంతలా మాట్లాడుతున్నావా?’ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నావని ప్రశ్నిస్తూనే.. ‘చీమలు పెట్టిన పుట్టలో పాముల్లా వచ్చి చేరారు’ అంటూ బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కోసం పోరాడింది ఒకరైతే, అధికారాన్ని అనుభవించింది మరొకరనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. కేటీఆర్ తన గతాన్ని, తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. మొత్తం మీద మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మార్చాయి.
Also Read: కొండాయికి ‘సీతక్క’ భరోసా.. వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, రూ. 16 కోట్లతో అభివృద్ధి పనులు!
నువ్వెంత.. నీ బతుకెంత..
కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం
దేశం కోసం త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబంపై విమర్శలు చేసే హక్కు కేటీఆర్కు లేదు
‘అమెరికాలో పెట్రోల్ బంకుల్లో పని చేసిన నీ స్థాయి ఏంటో ఆలోచించుకో
మోతిలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం కోసం… pic.twitter.com/SmlU22dEWE
— BIG TV Breaking News (@bigtvtelugu) May 6, 2026