E-Paper
Advertisement

కొండాయికి ‘సీతక్క’ భరోసా.. వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, రూ. 16 కోట్లతో అభివృద్ధి పనులు!

కొండాయికి ‘సీతక్క’ భరోసా.. వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, రూ. 16 కోట్లతో అభివృద్ధి పనులు!
Advertisement

Kondai Development: ములుగు జిల్లాలోని కొండాయి గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇటీవల కొండాయి గ్రామ పంచాయతీ పరిధిలో పర్యటించిన ఆమె, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు ,ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది సంభవించిన భారీ వరదల వల్ల కొండాయి గ్రామం ఎంతగానో నష్టపోయిందని, ఆ కష్ట కాలంలో తాము అండగా నిలబడ్డామని గుర్తు చేస్తూ.. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మరిన్ని నిధులతో గ్రామాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.

ప్రధానంగా ఇళ్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తొలి విడతలోనే 115 ఇందిరమ్మ ఇళ్లను ఈ గ్రామానికి మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే మంజూరైన ఇళ్లతో పాటు, మిగిలిపోయిన అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండో విడతలో ఖచ్చితంగా ఇళ్లు కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు. గూడు లేని నిరుపేదలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ లక్ష్యం ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమేనని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Also read: తల్లికి మాటిచ్చాడు.. 71 ఏళ్ల వయసులో నిలబెట్టుకున్నాడు.. ఇది కదా ప్రేమ అంటే!

అదేవిధంగా, గ్రామస్తులకు ప్రధాన సమస్యగా మారిన రవాణా సౌకర్యంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. కొండాయి వాగుపై సుమారు 16 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. వర్షాకాలం వస్తే ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వానలు మొదలయ్యే లోపే బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం ఈ వంతెనను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆమె గట్టిగా చెప్పారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత శక్తి మేరకు గ్రామాన్ని ఆదుకున్నామని, ఇప్పుడు అధికారంలో ఉండి మరింత బాధ్యతగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Advertisement

Also read: అమరుల స్థూపానికి కట్టేసి కొట్టండి.. కానీ పేదలకు ఉచిత విద్య ఇవ్వండి.. కవిత సంచలన సవాల్

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×