E-Paper
Advertisement

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కారిడార్-4, ఆ ప్రాంతాల మీదుగా

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కారిడార్-4, ఆ ప్రాంతాల మీదుగా
Advertisement

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ కారిడార్-4 వ్యవహారం ఎంత వరకు వచ్చింది? ఏయే ప్రాంతాల మీదుగా మెట్రో రాబోతోంది? శనివారం జరిగిన సమావేశంలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ఇంతకీ కారిడార్-4 ప్రతిపాదించిన కొత్త మార్గం ఏది? ఇవే చర్చ జోరుగా సాగుతోంది.

కారిడార్-IV సమావేశం

Advertisement

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తన రెండో దశ ప్రాజెక్టు కింద కారిడార్-IV కోసం మెట్రో రైలు ప్రధాన కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది. దీనికి గ్రేటర్ హైదరాబాద్- మెట్రో అధికారులు హాజరయ్యారు. 36.8 కిలోమీటర్ల దూరానికి దాదాపు 11 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్కలు వేశారు. ఈ రూటులో ఎలివేటెడ్ కారికార్లు, ప్రత్యామ్నాయ మార్గాల సాధ్యాసాధ్యాలపై చర్చించారు.

ఏయే ప్రాంతాల మీదుగా

Advertisement

దీనికి సంబంధించి ప్రతిపాదిత మార్గాన్ని విడుదల చేసింది మెట్రో రైలు. రెండవ దశలో భాగంగా నాగోల్ నుండి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో రైలును అనుసంధానం చేయనుంది. నాగోల్, నాగోల్ ఎక్స్ రోడ్, అల్కాపురి జంక్షన్, కామినేని హాస్పిటల్, ఎల్‌బి నగర్, బైరామల్‌గూడ, మైత్రి నగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట్ రోడ్, ఒవైసీ హాస్పిటల్, డిఆర్‌డిఓ కంచన్‌బాగ్, బాలాపూర్ రోడ్, చాంద్రాయణగుట్ట ఉండనుంది.

బండ్లగూడ, న్యూ కోర్ట్, న్యూ కోర్ట్, న్యూ కోర్ట్, మెయిల్, గగన్‌పహాడ్, సతంరాయ్, సిద్దంతి, శంషాబాద్, కార్గో వంటి స్టేషన్లను కలుపుతూ రాజీవ్‌గాంధీ విమానాశ్రయం (RGIA) వరకు రానుంది. ప్రస్తుతం సూచించిన స్టేషన్లు, వాటి స్థానాలు, పేర్లు తాత్కాలికమేనని హెచ్‌ఎంఆర్‌ఎల్‌  చెబుతున్నమాట. ఇది కేవలం అంచనాగా వేసిన రూటు మ్యాప్ మాత్రమే.

ALSO READ: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

మరికొన్ని అంశాలపై అధికారుల చర్చ

ఈ కొత్త మార్గం రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుండి నాగోలు వరకు ప్రయాణీకులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, సిటీ అంతటా కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో విస్తరణలో కారిడార్-IV చేరింది. అయితే ఈ మార్గాల్లో కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తం కావచ్చనే చర్చ జరిగింది.

డబుల్ ఎలివేటెడ్‌పై అభ్యంతరాలు

ముఖ్యంగా విప్రో మార్గంలో డబుల్ ఎలివేటెడ్ కారిడార్ లను నిర్మించడంపై మెట్రో అధికారులు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 65 అడుగుల ఎత్తులో మెట్రో స్టేషన్లను నిర్వహించడం సవాళ్లు ఎదురవుతాయని అంటున్నారు.

మెట్రో రైలు విషయంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా. అయితే ప్రత్యామ్నాయ పరిష్కారాల కోసం జీహెచ్ఎంసీ-హెచ్ఏఎంఎల్ కలిసి పని చేయాలని సూచించారు. మెట్రో అధికారులు ప్రస్తుతం ఈ మార్గాల కోసం ట్రాఫిక్ సర్వేలు, మట్టి పరీక్షలు నిర్వహించడంలో బిజీగా ఉన్నారు. ఈ వ్యవహారం ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి అవుతుందని భావిస్తున్నారు. అలాగే పర్యావరణ అంశాన్ని కూడా అంచనా వేస్తున్నారు మెట్రో అధికారులు.

ప్రస్తుతం ప్రతిపాదించింది ఈ ప్రాంతాల మీదుగా మాత్రమే. ఇందులో మార్పులు జరిగే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పుడు ఆ మార్గాలను ఒక్కసారి పరిశీలిద్దాం.

నాగోల్ (విమానాశ్రయం)
నాగోల్ ఎక్స్ రోడ్
అల్కాపురి జంక్షన్
కామినేని హాస్పిటల్
ఎల్బీ నగర్ (విమానాశ్రయం)
బైరమల్గూడ
మైత్రి నగర్
కర్మన్‌ఘాట్
చంపాపేట్ రోడ్డు
ఒవైసీ హాస్పిటల్
DRDO కాంచన్‌బాగ్
బాలాపూర్ రోడ్డు
చంద్రాయణగుట్ట
బండ్లగూడ రోడ్డు
మైలార్‌దేవ్‌పల్లి
కాటేడాన్
ఆరాంఘర్
కొత్త హైకోర్టు
గగన్‌పహాడ్
సతంరాయ్
సిద్ధాంతి
శంషాబాద్
సరుకు
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)

 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×