E-Paper
Advertisement

Telangana Govt: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు, ఎందుకు?

Telangana Govt: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు, ఎందుకు?
Advertisement

Telangana Govt: తెలంగాణలో కొందరు ఐపీఎస్‌ల వ్యవహారశైలిపై జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై కొందరు నేతలు ఓపెన్‌గా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అధికారులు సరిగా విధులు నిర్వహించలేదని, పార్ట్ టైమ్ మాత్రమే చేస్తున్నారని ఇంటబయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం జరుగుతుండగా మరోవైపు ఎనిమిది మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం కలిగింది.

ఈ మేరకు అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో హైదరాబాద్‌ క్రైమ్స్‌ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా జోయల్ డేవిస్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజారావు భూపాల్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేశారు. సీఐడీ ఎస్పీగా నవీన్‌‌కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, సీఐడీ ఏడీసీగా రామ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్‌ ఎస్బీ డీసీపీగా చైతన్యకుమార్‌‌లను నియమించారు.

Advertisement

రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారులను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ ఆదేశాల జారీ చేసింది. రోడ్‌ సేఫ్టీ డీజీగా పని చేస్తున్న అంజనీకుమార్‌, రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీ అభిలాష బిస్త్‌ను రిలీవ్‌ చేసింది ప్రభుత్వం.

తక్షణమే ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున కరీంనగర్‌ సీపీ అభిషేక్‌ మొహంతి రిలీవింగ్‌పై ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. ఈసీ నిర్ణయంపై ఆయన రిలీవింగ్‌ ఆధారపడి ఉంది. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన కొందరు అధికారులు క్యాట్‌ ఉత్తర్వుల మేరకు తెలంగాణాలోనే పని చేస్తున్నారు.

Advertisement

ALSO READ: యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి

కొత్త జిల్లాలు నేపథ్యంలో తమకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేటాయించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.  అధికారుల కొరత వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించింది.   ఈ క్రమంలో కొందర్ని కేటాయించింది. అయితే  ఏపీ విభజన సమయంలో చాలామంది అధికారులు తెలంగాణలో ఉండిపోయారు. న్యాయస్థానాల ఆదేశాలతో తెలంగాణ నుంచి వారంతా ఇప్పుడు రిలీవ్ అవుతున్నారు. మొన్నటికి మొన్న ఐఏఎస్ అధికారుల వంతు కాగా.. ఇప్పుడు ఐపీఎస్ అధికారుల వంతైంది.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×