E-Paper
Advertisement

Hyderabad News: బందోబస్తు మధ్య కొండాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. Rs. 720 కోట్ల భూమి సేఫ్

Hyderabad News: బందోబస్తు మధ్య కొండాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. Rs. 720 కోట్ల భూమి సేఫ్
Advertisement

Hyderabad News:  హైదరాబాద్ సిటీలో అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపిస్తోంది హైడ్రా. శనివారం ఉదయం కొండాపూర్‌‌లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వం స్థలంలో ఏళ్ల తరబడి కబ్జా చేశారు కొందరు వ్యక్తులు.  చివరకు దృష్టి సారించారు అధికారులు. కాపాడిన భూమి విలువ అక్షరాలా 720 కోట్ల రూపాయలు. మార్కెట్లో దీని విలువ రూ. 3,600 కోట్లు ఉంటుందని అంచనా.

హైదరాబాద్ సిటీలో హైడ్రా కూల్చివేతలు

Advertisement

ఒకప్పుడు నిత్యం పచ్చదనంతో కళకళలాడేది హైదరాబాద్ సిటీ. నగరం చుట్టూ చుట్టూ అందంగా లేక్‌లు ఉండేవి. వర్షాలు వచ్చినా నగరానికి ఎలాంటి సమస్య ఉండేదికాదు.  రానురాను చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాదారుల వశమయ్యాయి. కొన్ని న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టుల నుంచి అనుమతులు రావడంతో వాటిపై కొరడా ఝులిపిస్తోంది.

తాజాగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో కొండాపూర్ ప్రాంతంలోని బిక్షపతి నగర్‌లో దాదాపు రూ.720 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసుకు సమీపంలో సర్వే నంబర్ 59లో 36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని చాలామంది వ్యక్తులు కబ్జా చేశారు. తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు.

Advertisement

ఆ భూమి దాదాపు రూ. 720 కోట్లు

ఈ స్థలంపై వివాదం రెండున్నర దశాబ్దాలుగా పోరాటం సాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఉదయం ఆక్రమణల తొలగించింది హైడ్రా. రెండురోజుల కిందట సమాచారం ఇచ్చింది. తాత్కాలిక షెడ్డులను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకున్న వారిని ఖాళీ చేయించింది.

ALSO READ: తెలంగాణలోని ఆ గ్రామాల్లో ఎన్నికలు బంద్

భారీ బందోబస్తు మధ్య అక్కడ షెడ్డులను తొలగించింది. కూల్చివేతల వద్దకు ఎవరినీ అనుమతించలేదు అధికారులు. రెండు కిలోమీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేసి స్థానికులు రాకుండా అడ్డుకున్నారు. అంతేకాదు భూమి చుట్టూ కంచె వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు పెట్టింది హైడ్రా. మరోవైపు 60 ఏళ్లుగా ఈ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని అక్కడివారు చెబుతున్నారు.

హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు.  దానిపై విచారణ చేపట్టిన తర్వాత అప్పుడు కూల్చివేతలకు దిగుతున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో దాదాపు రూ. 50 వేల కోట్ల విలువైన భూమిని కాపాడింది.   923 ఎకరాల ప్ర‌భుత్వ భూమి. వ‌ర‌ద భ‌యం లేని న‌గ‌ర‌మే హైడ్రా ల‌క్ష్యమని ఇటీవల కమిషనర్ తెలిపారు.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×