E-Paper
Advertisement

Hydra effect: హైడ్రా దూకుడు.. వణుకుతున్న సెలబ్రిటీలు.. రేపోమాపో కన్వెన్షన్ సెంటర్లపై..

Hydra effect: హైడ్రా దూకుడు.. వణుకుతున్న సెలబ్రిటీలు.. రేపోమాపో కన్వెన్షన్ సెంటర్లపై..
Advertisement

Hydra on illegal constructions(Hyderabad latest news): రేవంత్‌రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ.. చాలామంది నేతలు, నటులు, రియల్టర్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. హైడ్రా అధికారులు ఎప్పుడు తమ అపార్టుమెంట్లను కూల్చుతారోనన్న భయంతో బెంబేలెత్తుతున్నారు.

రాజకీయ, సినీ, అధికారుల, సామాన్యులు సైతం ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులను కబ్జా చేసి పెద్ద పెద్ద భవనాలను కట్టేశారు. ఆక్రమణకు గురైన చెరువులను రక్షించకపోతే వర్షాలు వచ్చినప్పుడు ఫ్లడ్‌ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. చెరువుల చుట్టూ కబ్జాకు గురైన వాటిపై హైడ్రా దృష్టి సారించింది.

Advertisement

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 20 చెరువుల ఆక్రమణలను తొలగించారు అధికారులు. దాదాపు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అధికారులపై రాజకీయ పరమైన ఒత్తిళ్లు లేకపోలేదు. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపైనా కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది హైడ్రా.

ALSO READ:  గ్రూప్ -1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పు

Advertisement

గడిచిన పదేళ్లలో హైదరాబాద్ సిటీ పరిధిలో వేలాది ఎకరాలు యథేచ్ఛగా కబ్జాలకు గురయ్యాయి. వార్డు కార్పొరేటర్ మొదలు బడా రాజకీయ నాయకుల వరకు ఉన్నారన్నది అసలు నిజం. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులున్నట్లు వార్తలు లేకపోలేదు. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ హాల్‌ను కట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.

గతంలో కేసీఆర్ సర్కార్ వాటిని కూల్చేందుకు బుల్ డోజర్లను పంపినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణా మాల కారణంగా వెనక్కివెళ్లిపోయింది. దీనిపై హైడ్రా దృష్టి సారించినట్టు సమాచారం. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువుల కబ్జాలపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా దాదాపు 56 చెరువులు కబ్జా అయినట్టు తేలింది.

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. ఈ ఏడాది సమ్మర్‌లో మంచినీరు దొరక్క బెంగుళూరు వాసులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీకావు. అక్కడి చెరువులను కబ్జా చేసి భవనాలు కట్టేశారు. ఫలితంగా బెంగుళూరు వాసులు గుప్పెడు నీటి కోసం కష్టాలు పడ్డారు. ముంబై సిటీ శివార్లలో భారీగా చెరువులు ఉన్నాయి. వర్షాలు పడినా నీరంతా వాటిలోకి వెళ్లిపోతుంది. తాగునీటికి అక్కడ ఇబ్బంది రాలేదన్నది అక్కడి ప్రజల మాట. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ అటు వైపు దృష్టిసారించింది. హైడ్రా వ్యవస్థను తీసుకురావడంతో కబ్జా రాయుళ్లు వణుకుతున్నారు.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×