HYDRAA: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కబ్జాలకు గురైన చెరువులను హైడ్రా పునరుద్దరిస్తున్న సంగతి తెలిసిందే. చరిత్ర పుటల్లో కనుమరుగైన అంబర్ పేట సమీపంలోని బతుకమ్మ కుంటకు ప్రాణం పోసి సిటీలోనే ఆకర్షియమైన ప్రదేశంగా తీర్చిదిద్దింది. తద్వారా నగర ప్రజల ప్రశంసలు అందుకుంది. 6 చెరువులే లక్ష్యంగా తొలిదశ పనులు మెుదలు పెట్టిన హైడ్రా.. నాలుగు చెరువుల పునరుద్దరణ చేసి వాటికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. మరో రెండు చెరువుల పునరుద్దరణ పనులు తుది దశలో ఉన్నపుడే రెండో దశగా సిటీలోని వివిధ ప్రాంతాల్లోని మరో 14 చెరువులను పునరుద్దరించేందుకు హైడ్రా సిద్దమైనట్లు తెలిసింది.
హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 1240 చోట్ల ఆక్రమణలు తొలగించి సుమారు రూ. లక్షల కోట్ల విలువైన 1310 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. అంతేగాక ఈ కబ్జాల వెనకున్న రాజకీయ నేతలు, బడాబాబులుగా గుట్టును రట్టు చేసింది. అటు చెరువుల పునరద్దరణ కోసం చేపట్టిన తొలిదశ పనులు పూర్తి కావొస్తుండటంతో రెండో దశ ప్రక్రియ కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 14 చెరువులను పునరుద్దిరించేందుకు హైడ్రా రూపకల్పన చేసిన ప్రతిపాదనలకు సర్కారు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇందుకోసం రూ.303 కోట్లు ఖర్చు చేయనన్నుట్లు అంచనాలు ఉన్నాయి.
కేవలం చెరువులను పరిరక్షించటం, పునరుద్ధరించటమే గాక స్థానికుల అవసరాలకు తగిన విధంగా వాటిని అభివృద్ది చేయడం హైడ్రా ఘనతగా చెప్పవచ్చు. రెండో దశ చెరువుల పునరుద్దరణ పనులు ప్రారంభమై వాటిలో సగం చెరువులకు పూర్వ వైభావాన్ని తీసుకువచ్చిన తర్వాత మరి కొన్ని చెరువులను ఎంపిక చేసుకోవాలని కూడా హైడ్రా భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Allu Arjun -Mrunal Thakur: అల్లు అర్జున్ అట్లీ సినిమాలో మృణాళ్ ఠాకూర్..హింట్ ఇచ్చిన బన్నీ!