Soil Mafia: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల మండలం ముల్కలపల్లి గ్రామ శివారులో మట్టి మాఫియా బరితెగిస్తోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా, పట్టపగలే యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కృష్ణా నది తీర ప్రాంతంలో జేసీబీలను ఉపయోగించి భారీ ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. నిరంతరం టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు.
Also read: మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!
అధికారుల భయం లేకుండా మాఫియా సభ్యులు పట్టపగలే ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుండటం గమనార్హం. నదీ పరివాహక ప్రాంతం దెబ్బతినడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతాయని, అలాగే భారీ వాహనాల రాకపోకలతో స్థానిక రోడ్లు పాడవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ మట్టి రవాణాపై రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరారు.
Also read: భీంనగర్లో సినిమా చూపిస్తున్న అధికారులు.. ఆదర్శమా లేక రాజకీయమా?