E-Paper
Advertisement

TS High Court : వరద సాయంపై విచారణ.. 500 కోట్లపై హైకోర్టు ప్రశ్నలు..

TS High Court : వరద సాయంపై విచారణ.. 500 కోట్లపై హైకోర్టు ప్రశ్నలు..
Advertisement
TS High Court

TS High Court : తెలంగాణలో వర్షాలు, వరదలపై ధాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై రెండోసారి నివేదికను హైకోర్టుకు అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. వరదలపై ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికపై విచారణ చేపట్టింది హైకోర్టు. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం నివేదికలో తెలిపింది. 500 కోట్లు పునరావాసం కోసం కేటాయించినట్లు వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం.

Advertisement

రెండోసారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని వాదనలు వినిపించారు పిటిషనర్ తరుపు న్యాయవాది. వరద ప్రభావం, నష్టంపై మరో నివేదిక మోమోను హైకోర్టుకు సమర్పించారు పిటిషనర్‌ తరపు న్యాయవాది. 500 కోట్లు ఎవరికి ఎంత పరిహారం ఇచ్చారో నివేదికలో లేదని ప్రశ్నించింది హైకోర్టు. 500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.

అంటువ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని.. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఆగష్టు 17 వాయిదా వేసింది హైకోర్టు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×