BigTV English

TS High Court : వరద సాయంపై విచారణ.. 500 కోట్లపై హైకోర్టు ప్రశ్నలు..

TS High Court : వరద సాయంపై విచారణ.. 500 కోట్లపై హైకోర్టు ప్రశ్నలు..
TS High Court


TS High Court : తెలంగాణలో వర్షాలు, వరదలపై ధాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై రెండోసారి నివేదికను హైకోర్టుకు అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. వరదలపై ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికపై విచారణ చేపట్టింది హైకోర్టు. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం నివేదికలో తెలిపింది. 500 కోట్లు పునరావాసం కోసం కేటాయించినట్లు వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం.

రెండోసారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని వాదనలు వినిపించారు పిటిషనర్ తరుపు న్యాయవాది. వరద ప్రభావం, నష్టంపై మరో నివేదిక మోమోను హైకోర్టుకు సమర్పించారు పిటిషనర్‌ తరపు న్యాయవాది. 500 కోట్లు ఎవరికి ఎంత పరిహారం ఇచ్చారో నివేదికలో లేదని ప్రశ్నించింది హైకోర్టు. 500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.


అంటువ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని.. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఆగష్టు 17 వాయిదా వేసింది హైకోర్టు.

Related News

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Big Stories

×