BigTV English
Advertisement

TS High Court : వరద సాయంపై విచారణ.. 500 కోట్లపై హైకోర్టు ప్రశ్నలు..

TS High Court : వరద సాయంపై విచారణ.. 500 కోట్లపై హైకోర్టు ప్రశ్నలు..
TS High Court


TS High Court : తెలంగాణలో వర్షాలు, వరదలపై ధాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై రెండోసారి నివేదికను హైకోర్టుకు అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. వరదలపై ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికపై విచారణ చేపట్టింది హైకోర్టు. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం నివేదికలో తెలిపింది. 500 కోట్లు పునరావాసం కోసం కేటాయించినట్లు వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం.

రెండోసారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని వాదనలు వినిపించారు పిటిషనర్ తరుపు న్యాయవాది. వరద ప్రభావం, నష్టంపై మరో నివేదిక మోమోను హైకోర్టుకు సమర్పించారు పిటిషనర్‌ తరపు న్యాయవాది. 500 కోట్లు ఎవరికి ఎంత పరిహారం ఇచ్చారో నివేదికలో లేదని ప్రశ్నించింది హైకోర్టు. 500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.


అంటువ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని.. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఆగష్టు 17 వాయిదా వేసింది హైకోర్టు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×