Medchal News: మేడ్చల్ స్వేచ్ఛ: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిమ్మకాయల పెద్దిరాజు పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అలాగే మేడ్చల్ పట్టణంలో యువతతో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
Also Read: Ration Rice: జోరుగా అక్రమ రేషన్ దందా? పేదల బియ్యం కర్ణాటకకు.. అధికారుల నిఘా ఎక్కడ?
ఈ సందర్భంగా నిమ్మకాయల పెద్దిరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ లక్ష్యమని తెలిపారు. జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చివరి నిమిషంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఒక మున్సిపల్ సీటు, ఒక కార్పొరేషన్ సీటు గెలుచుకోవడం పార్టీ బలాన్ని చూపిస్తోందని పేర్కొన్నారు. అలాగే రూ.35 కోట్ల 19 లక్షల టిటిడి నిధులతో కొండగట్టు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మోహన్ రావు, లలిత రాణి, నాగమణి, స్వప్న, సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Kidney Disease Symptoms: కిడ్నీ వ్యాధిని ముందే పసిగట్టే.. కంటి మార్పులు, అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు