E-Paper
Advertisement

Jangaon District: జనగామ జిల్లా రచ్చ.. ఎమ్మెల్యే పల్లా వర్సెస్ ఎంపీ చామల.. ‘మూతపడేది జిల్లానా? మీ ప్రభుత్వమా?’

Jangaon District: జనగామ జిల్లా రచ్చ.. ఎమ్మెల్యే పల్లా వర్సెస్ ఎంపీ చామల.. ‘మూతపడేది జిల్లానా? మీ ప్రభుత్వమా?’
Advertisement

Jangaon District: జనగామ జిల్లా ఉనికిపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ సెగలు రాజుకున్నాయి. జిల్లా తొలగింపు అంశంపై జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది.

మీ ప్రభుత్వమే మూతపడుతుంది: ఎమ్మెల్యే పల్లా

జనగామ జిల్లాను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అనేక పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న జనగామ జిల్లాను క్లోజ్ చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. “జనగామ జిల్లా ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు.. ఒకవేళ జిల్లాను మూసేస్తే, మీ పార్టీ, మీ ప్రభుత్వమే మూతపడటం ఖాయం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కావాలనే ప్రభుత్వం జిల్లాల ప్రక్షాళన పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

ఎంపీ చామల కౌంటర్..

Advertisement

ఎమ్మెల్యే పల్లా వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. జనగామ జిల్లా తొలగింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కనీసం చర్చ కూడా జరగలేదని స్పష్టం చేశారు. “పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల ప్రక్షాళన చేస్తామని మాత్రమే చెప్పాం తప్ప, జనగామను తీసేస్తామని ఎవరూ అనలేదు. కొంతమంది రాజకీయ నాయకులు కావాలనే ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు” అని విమర్శించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ‘ఇమ్మెచూర్’ (పరిపక్వత లేని) మాటలు మాట్లాడుతున్నారని, ఇతర నాయకులపై ద్వేషంతో అపోహలు సృష్టించవద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.

కమిటీ ఏర్పాటు..

జిల్లాల ప్రక్షాళనపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ (మంత్రుల కమిటీ)ని లేదా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కూడిన నిపుణుల కమిటీని నియమించాలని భావిస్తోంది. దీనిపై అధికారిక జీవో త్వరలో వెలువడే అవకాశం ఉంది. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు దూరభారం కాకుండా ఉండటం, వనరుల సమాన పంపిణీని పరిశీలించడం. కొన్ని చిన్న జిల్లాలను కలపడం లేదా సరిహద్దులను మార్చడం వంటి అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.

Advertisement

Read Also: పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ: ఆర్టికల్ 131 కింద కేసు వేస్తామన్న మంత్రి ఉత్తమ్!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×