E-Paper
Advertisement

JSW invest In Telangana: తెలంగాణలో జేఎస్ డబ్ల్యూ పెట్టుబడులు.. 800 కోట్లతో

JSW invest In Telangana: తెలంగాణలో జేఎస్ డబ్ల్యూ పెట్టుబడులు.. 800 కోట్లతో
Advertisement

JSW UAV In Telangana: దావోస్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు భారీ పెట్టుబడులను సమీకరించింది. మూడు కంపెనీలతో రికార్డు స్థాయిలో అంటే దాదాపు 56 వేల కోట్లకుపైగా ఒప్పందాలు చేసుకుంది. వీటి ద్వారా తెలంగాణ యువతకు దాదాపు 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

తెలంగాణలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్​ డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికా‌కు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెల కొల్పనుంది. ఈ యూనిట్ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఆ కంపెనీ.

Advertisement

దీనికి సంబంధించి దావోస్​ జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో జెఎస్ డబ్ల్యు డిఫెన్స్‌ అనుబంధ సంస్థ జె ఎస్ డబ్ల్యు యూఏవీ లిమిటెడ్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీ ఎండీ పార్థ్ జిందాల్‌ తో-ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన ఒప్పందం జరిగింది. ఈ యూనిట్ ద్వారా  200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలంగా మారనుంది. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలతో పాటు డ్రోన్ టెక్నాలజీకి కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

ALSO READ: రాష్ట్రానికి రూ.45,500 కోట్లతో భారీ పెట్టుబడులు

ఈ ఒప్పందం రక్షణ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. కేవలం ఇదే కాకుందా ఐటీ, ఫార్మాతో పాటు అన్ని రంగాల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని తెలిపారు.

జేఎస్​ డబ్ల్యూ సంస్థ తమ యూనిట్‌ను ఆదిభట్లలో నెలకొల్పే అవకాశముంది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఏరో స్పేస్ పార్కుకు శంకుస్థాపన చేశారు. గతంలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ అక్కడ పెట్టుబడులు పెట్టిన విషయం తెల్సిందే. మొత్తానికి ఆదిభట్ల ప్రాంతం డిఫెన్స్ ఉత్పత్తులకు కేరాఫ్‌గా మారనుంది.

 

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×