BigTV English
Advertisement

JSW invest In Telangana: తెలంగాణలో జేఎస్ డబ్ల్యూ పెట్టుబడులు.. 800 కోట్లతో

JSW invest In Telangana: తెలంగాణలో జేఎస్ డబ్ల్యూ పెట్టుబడులు.. 800 కోట్లతో

JSW UAV In Telangana: దావోస్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు భారీ పెట్టుబడులను సమీకరించింది. మూడు కంపెనీలతో రికార్డు స్థాయిలో అంటే దాదాపు 56 వేల కోట్లకుపైగా ఒప్పందాలు చేసుకుంది. వీటి ద్వారా తెలంగాణ యువతకు దాదాపు 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.


తెలంగాణలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్​ డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికా‌కు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెల కొల్పనుంది. ఈ యూనిట్ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఆ కంపెనీ.

దీనికి సంబంధించి దావోస్​ జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో జెఎస్ డబ్ల్యు డిఫెన్స్‌ అనుబంధ సంస్థ జె ఎస్ డబ్ల్యు యూఏవీ లిమిటెడ్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీ ఎండీ పార్థ్ జిందాల్‌ తో-ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన ఒప్పందం జరిగింది. ఈ యూనిట్ ద్వారా  200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.


రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలంగా మారనుంది. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలతో పాటు డ్రోన్ టెక్నాలజీకి కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ALSO READ: రాష్ట్రానికి రూ.45,500 కోట్లతో భారీ పెట్టుబడులు

ఈ ఒప్పందం రక్షణ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. కేవలం ఇదే కాకుందా ఐటీ, ఫార్మాతో పాటు అన్ని రంగాల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని తెలిపారు.

జేఎస్​ డబ్ల్యూ సంస్థ తమ యూనిట్‌ను ఆదిభట్లలో నెలకొల్పే అవకాశముంది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఏరో స్పేస్ పార్కుకు శంకుస్థాపన చేశారు. గతంలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ అక్కడ పెట్టుబడులు పెట్టిన విషయం తెల్సిందే. మొత్తానికి ఆదిభట్ల ప్రాంతం డిఫెన్స్ ఉత్పత్తులకు కేరాఫ్‌గా మారనుంది.

 

Related News

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

Maganti Family Issue: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్.. సునీతకు వ్యతిరేకంగా ఏకమైన మాగంటి ఫ్యామిలీ

Hyderabad: జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ హత్య కేసులో 24 గంటల్లోనే వీడిన మిస్టరీ!

Bandi Sanjay: బోరబండ రోడ్ షో రగడ.. పోలీసులు ఎంఐఎం తొత్తులా?, బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×