E-Paper
Advertisement

Junior Doctors Strike : రిమ్స్ లో జూనియర్‌ వైద్యులపై దాడి ఘటన.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పై వేటు.. ఐదుగురిపై కేసు..

Junior Doctors Strike : రిమ్స్ లో జూనియర్‌ వైద్యులపై దాడి ఘటన.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పై వేటు.. ఐదుగురిపై కేసు..
Advertisement

Junior Doctors Strike : ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)కి చెందిన ఆరుగురు జూనియర్ వైద్యులపై బుధవారం రాత్రి క్యాంపస్‌లోకి చొరబడిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో సహా ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కిరణ్, అతని స్నేహితులు వసీం, శివ, మరో ఇద్దరు దాడి చేయడంతో జూనియర్ డాక్టర్లు టి. కవిరాజ్, భరత్, పి. నవీన్, అభిషేక్, విజయ్ గాయపడ్డారని ఆదిలాబాద్ టౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ జి. ప్రదీప్ కు తెలిపారు. కవి రాజ్ ఫిర్యాదు మేరకు క్రాంతి కిరణ్, వసీం, శివ, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సహా మరో ఇద్దరిపై ఐపీసీ 337, 447, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. క్రాంతి కుమార్, వసీం, శివలను అరెస్టు చేశారు.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రాంతి కిరణ్, వసీం, శివతో కలిసి అర్ధరాత్రి క్యాంపస్‌లోకి వెళ్లారు. దీంతో వారు ఐదుగురు జూనియర్ డాక్టర్లతో వాగ్వాదానికి దిగి వారిని కొట్టారు. ఆ తర్వాత క్రాంతి కిరణ్ తన కారు బానెట్‌పై అభిషేక్‌ను 500 మీటర్ల దూరం లాక్కెల్లాడు. జూనియర్ డాక్టర్‌ను గేటు వద్ద పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. వసీమ్‌తో పాటు మరో ముగ్గురు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటన డైరెక్టర్‌కు తెలుసని ఆరోపించారు. బాధితులకు మాజీ మంత్రి జోగు రామన్న సంఘీభావం తెలిపారు.

Advertisement

ఘర్షణలో పాత్ర ఉన్న కారణంగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కిరణ్ తొలగించామని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. విద్యార్థుల ఆరోపణలను ఆయన ఖండించారు. తాను విద్యార్థులను ఎప్పుడూ టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. నేరం రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×