BigTV English
Advertisement

Ku Hostel: కేయూలో తప్పిన ప్రమాదం,గర్ల్స్‌ హాస్టల్‌లో స్లాబ్‌ పెచ్చులు ఊడి..

Ku Hostel: కేయూలో తప్పిన ప్రమాదం,గర్ల్స్‌ హాస్టల్‌లో స్లాబ్‌ పెచ్చులు ఊడి..

Kakatiya University Hostel Slap Cracks In Girls Hostel Again: తెలంగాణలోనే రెండో రాజధానిగా పేరున్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరుస ఘటనలు విద్యార్థులను హడలెత్తిస్తున్నాయి.ఈ మధ్యే హాస్టల్‌లో ఫ్యాను ఊడి మీద పడి తల పగిలిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ క్యాంపెస్‌లో.ఇలాంటి వరుస ఘటనలు అక్కడి విద్యార్థులకు కంటిమీద కునుకులేకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్ లో స్లాబ్ పై పెచ్చులు ఊడి కింద పడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.


అదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగే సమయానికి హాస్టల్‌లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.దీంతో హాస్టల్‌లో ఉండే గర్ల్స్ అందరూ ఊపిరిపీల్చుకున్నారు.ఎవరైనా జిల్లా అధికారులు వచ్చినప్పడు మాత్రమే ఇక్కడి అధికారులు హడావిడి చేశారు,కానీ హాస్టల్ లో ఉన్న వారిని చేంజ్ చేసే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తరుచు ప్రమాదాలు జరుగుతున్న కాకతీయ యూనివర్సిటీలో ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు.పురాతన భవనాలలో హాస్టల్స్ నిర్వహిస్తున్నారంటూ పలువురు బాలికలు బయట ప్రైవేట్ హాస్టల్‌లో డబ్బులు కట్టి మరి ఉంటున్న పరిస్థితి నెలకొంది.ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడి పడతాయా, ఎవరిపై ఫ్యాన్లు ఊడి పడతాయా అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థిని విద్యార్థులు గడుపుతున్న పరిస్థితి. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఘటనలపై స్పందించి కేయూలో కొత్త భవనాలను నిర్మించి విద్యార్థులకు అన్ని వసతులు ఉన్న భవనాలలోకి హాస్టల్స్ మార్చాలని విద్యార్థులు వేడుకుంటున్నారు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు.

Also Read: త్వరలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమావేశం


ఇక ఇదే ఘటనపై ఈ మధ్యే హన్మకొండ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అధికారులు వర్షాకాలం నేపథ్యంలో పురాతన భవనాలు కూలి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో గత కొన్ని రోజుల క్రితం వాటి జాబితా సిద్ధం చేసింది. అంతేకాదు వాటి కారణంగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కూల్చివేయాలని అన్నప్పటికీ..నగరంలోని కాలనీలలో ఉన్న భవనాలను చూస్తారే తప్ప ప్రభుత్వ హాస్టల్స్ కానీ ప్రభుత్వ ఆఫీసులను కానీ అధికారులు పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి ఈ ఘటనపై సత్వరమే సమస్యను పరిష్కరించి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలంటూ కేయూ క్యాంపస్ మెయిన్ గేట్ ఎదుట కేయూ స్టూడెంట్స్ ధర్నాకు దిగారు.

Tags

Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×