E-Paper
Advertisement

తేజిస్వి సూర్య నీకెంత ధైర్యం?.. అలా ఎలా మాట్లాడుతావ్, కల్వకుంట్ల కవిత ఫైర్

తేజిస్వి సూర్య నీకెంత ధైర్యం?.. అలా ఎలా మాట్లాడుతావ్, కల్వకుంట్ల కవిత ఫైర్
Advertisement

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్ – పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ తీరును తప్పుబడుతూ ఆమె ఒక ఘాటైన ప్రకటన విడుదల చేశారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షను అంత చులకనగా ఎలా చూస్తారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను అవమానపరిచేలా మాట్లాడే ధైర్యం అతనికి ఎక్కడిదని హెచ్చరించారు.

తెలంగాణ ప్రజలు వివక్షకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు శాంతియుత పోరాటం చేశారని కవిత గుర్తు చేశారు. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం ఇక్కడి అమరవీరులను అవమానించడమేనని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు కావని తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా ఆమె అభివర్ణించారు. రాష్ట్ర అస్తిత్వాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదని తేజస్వీ సూర్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

బీజేపీ ఎంపీలు ఈ విషయంలో తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డపై గెలిచిన ఎంపీలకు పౌరుషం ఉంటే తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఖండించాలని సవాల్ విసిరారు. సొంత పార్టీ నేత తెలంగాణ సమాజాన్ని కించపరుస్తుంటే మౌనంగా ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు. వెంటనే తేజస్వీ సూర్యతో క్షమాపణలు చెప్పించాలని ఒత్తిడి తెచ్చారు.

తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడలేని వారు ప్రజాప్రతినిధులుగా కొనసాగే అర్హత కోల్పోతారని కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. ఢిల్లీ నాయకుల ముందు మోకరిల్లకుండా తెలంగాణ ఆత్మగౌరవం కోసం గొంతు ఎత్తాలని హితవు పలికారు. ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు స్పందించి తమ ప్రాంతం పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆమె కోరారు.

Advertisement

తెలంగాణ ఏర్పాటు వెనుక వేల మంది బలిదానాలు ఉన్నాయని కవిత గుర్తు చేశారు. అటువంటి పవిత్రమైన పోరాటాన్ని దేశ విభజన నాటి రక్తపాతంతో పోల్చడం తేజస్వీ సూర్య అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. చరిత్ర తెలియకుండా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి తరపున ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతమైతే సహించేది లేదని కవిత స్పష్టం చేశారు.

ALSO READ: తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే సహించం.. మహిళా బిల్లుతో ముడిపెట్టడం ఏంటి?, మరో ఉద్యమం తీసుకుస్తాం: కవిత

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×