Sabitha Indra Reddy: ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్కు ఎటువంటి సంబంధం లేదు అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఫోన్ క్యాపింగ్ జరుగుతుందా లేదా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని జోష్యం చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా రాబోయే రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కక్ష సాధింపు లో భాగంగానే కేసీఆర్కు సీట్ నోటీసులని ఆరోపించారు.
Also Read:
రైతుబంధు ఇచ్చినందుకు కేసీఆర్ కు సీట్ నోటీసులు ఇచ్చారా? కాలేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా? ఎందుకు కేసిఆర్ కు నోటీసులు ఇచ్చారా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్ పాలన అవినీతికి భయం అయిందని.. ఏ రంగం చూసిన అన్ని స్కాంలే బయటపడుతున్నాయని ఆరోపించారు. అవన్నీ బయటపడుతుంటే డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు కుంభకోణం పై హరీష్ రావు మాట్లాడగానే ఫోన్ టైపింగ్ కేసులో సీట్ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.
మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ 10 ఏళ్లలోనే దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్అని కొనియాడారు.కేసీఆర్ కు సీటు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు కొంతమంది అధ్యక్షతన చూపిస్తున్నారని అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు తగలబెడుతుంటే మా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రము మధ్య వాటాల పంచాయతీ బయటకు వస్తుంటే డైరెక్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు సిటీ పేరుతో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. గారడి విద్యలతో బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Also Read: CJ Roy: కాన్ఫిడెంట్ తో వ్యాపార సమ్రాజ్యాన్ని నిర్మించి.. కాన్ఫిడెంట్ కోల్పోయి ప్రాణాలు తీసుకుని..