BigTV English

KCR Yagam: కేసీఆర్ మహాయాగం.. ఈసారి కుటుంబం కోసమా? ప్రజల కోసమా?

KCR Yagam: కేసీఆర్ మహాయాగం.. ఈసారి కుటుంబం కోసమా? ప్రజల కోసమా?

KCR Yagam: అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ డీలా పడిపోయింది. ఒకవైపు నేతలు పార్టీల నుంచి వెళ్లిపోవడం.. మరోవైపు కేసులు చుట్టుముట్టాయి. ఇది పైకి తెలిసి.. లోలోపల చాలా సమస్యలు వెంటాడు తున్నాయి. దీంతో కేసీఆర్ ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీటి నుంచి బయటపడేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌లో మహా యాగం తలపెట్టారు గులాబీ బాస్ కేసీఆర్.


కేసీఆర్ అంటే ముందుగా యాగాలు గుర్తుకు వస్తాయి. గడిచిన పదేళ్లలో ఆయన మహా యాగాలు ఎన్నో చేశారు. తెలంగాణ ప్రజల గురించి.. సొంత సమస్యలా అనేది సెకండ్ పాయింట్. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వేద పండితుల ఆధ్వర్యంలో మహా యాగం చేపట్టారు కేసీఆర్ దంపతులు.

ALSO READ:  మేడిగడ్డ బ్యారేజ్.. కేసీఆర్‌, ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు నోటీసులు


కొడుకు కేటీఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్‌రావు కొంత మంది కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ వ్యవహారం చాలా సీక్రెట్ చేస్తున్నారు పెద్దాయన. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయన్నది పార్టీ కార్యకర్తల మాట. రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో మహా యాగం చేయాలని నిర్ణయించడం, శుక్రవారం తలపెట్టడం జరిగిపోయింది.

తెలంగాణ అధికార మార్పిడి జరిగిన తర్వాత అనేక సమస్యలు గులాబీ బాస్‌ను వెంటాడుతున్నాయి. కేసీఆర్‌తో ముఖ్యనేతలపై రకరకాల కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత, 150 రోజుల తర్వాత ఇటీవల తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.

మరోవైపు పార్టీ నుంచి నేతలు వెళ్లిపోవడంతో ఏం చేయ్యాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మహాయాగంపై దృష్టిసారించారు. ఇంకోవైపు ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణలు జరుగుతున్నాయి. వాటిని నుంచి ఆయన బయటపడలేకపోతున్నారు.. ప్రజల మధ్యకు రాలేకపోతున్నారు.

అన్నట్లు.. ఎనిమిదేళ్ల కిందట 2016‌లో ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మహా రాజాశ్యామల యాగం చేశారు కేసీఆర్. దాని ఫలితాలు కొంతవరకు అనుకూలంగా వచ్చాయి. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చారు కేసీఆర్. ఈసారి మాత్రం సమస్యల నుంచి బయటపడడానికి చేస్తున్నట్లు కొందరు నేతలు అంతర్గతంగా చెబుతున్నారు.

 

Related News

Hyderabad Water Cut: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. నగరంలో రెండు రోజులు తాగునీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్

Telangana: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Big Stories

×