KCR Visit: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి హనుమకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన విషయం మనందరికి తెలిసిన విషయమే.. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం యశోద ఆసుపత్రికి తరలించారు.
నేడు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు.
Also Read: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్.. హ్యాకర్ల చేతిలోకి ఆధార్, లోన్ వివరాలు..!
పెద్ది సుదర్శన్ రెడ్డి గుండుపోటుకు గురయ్యారన్న సమాచారం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు హుటాహుటిన హైదరాబాద్ నుంచి హనుమకొండకు బయల్దేరి వెళ్లారు. ఆసుపత్రికి వెళ్లి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. పెద్ది కోలుకుంటున్నారని, అదైర్యపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు.
యశోద హాస్పిటల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చిన కేసీఆర్ #KCR #BRS #PeddiSudarshanReddy #YashodaHospital #Bigtv https://t.co/51LPqfm0pZ pic.twitter.com/YURvyJtT0D
— BIG TV Breaking News (@bigtvtelugu) July 27, 2026
Also Read: కొత్తగా చేరిన పోలీస్ ఆఫీసర్ కు చెమటలు పట్టించే ఊరు… తెలుగులోనే ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్