E-Paper
Advertisement

BRS Leaders Migration : నైరాశ్యంలో బీఆర్ఎస్.. పీకల్లోతు కష్టాల్లో కారు పార్టీ

BRS Leaders Migration : నైరాశ్యంలో బీఆర్ఎస్.. పీకల్లోతు కష్టాల్లో కారు పార్టీ
Advertisement

brs party latest news

BRS Key leaders leaving the party(Telangana politics): లోక్‌సభ ఎన్నికల ముందు BRS పార్టీ నైరాశ్యంలో కూరుకుపోతోంది. నేతల వలసలతో ఏం చేయాలో తెలియక.. కేసీఆర్‌ దొర లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా మున్సిపాలిటీలు చేజారిపోతుంటే.. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలే వరుస షాక్‌లు ఇస్తున్నారు.

Advertisement

నాగర్‌ కర్నూల్‌ ఎంపీ రాములు నేడు బీజేపీలో చేరనున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సైతం.. అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని కాంగ్రెస్‌లో చేరారు. సిట్టింగ్ ఎంపీలే పార్టీ మారుతుండడంతో BRS ఢీలా పడుతోంది. చేవెళ్ల నుండి పోటీకీ రంజిత్ రెడ్డీ నిరాకరించినట్లు సమాచారం. కేటీఆర్ వైఖరే వల్లే పోటీ చేయడం లేదని నేతలు మాట్లాడుకుంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కారు పార్టీ.. పీకల్లోతూ కష్టాల్లోకి పడిపోయింది. అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్‌కు ఎదురచెప్పలేని నేతలు సైతం.. ఇప్పుడు పార్టీలో ఉండమంటూ మొహం మీద గుడ్‌ బై చెప్పేస్తున్నారు. దీంతో BRS రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోంది. అధినాయకత్వం పట్టించుకోక పోవడం వల్లే నేతలు వెళ్లిపోతున్నారనే టాక్‌ జోరుగా నడుస్తోంది.

Advertisement

Read More : నేడే మెగా డీఎస్సీ.. 11,062 పోస్టులకు నోటిఫికేషన్

షెడ్యూల్‌ విడుదలయ్యే నాటికి ఇంకెంతమంది చేజారిపోతారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని వీడే వారి సంఖ్య మరింత పెరగవచ్చని.. అధిష్టానం ఆందోళన చెందుతోంది. అసెంబ్లీ పోయినా.. లోక్‌సభతో అయినా బలపడదామని నేతలు భావించారు. కానీ ఆ వ్యూహం కాస్త బెడిసికొట్టింది. సిట్టింగులు నుంచి మాజీలు, చిన్న చిన్న లీడర్లు సైతం పార్టీకి దూరమవుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు టికెట్లు దక్కని నేతలంతా పక్క పార్టీల్లో చేరారు. కేసీఆర్ సమన్వయ లోపం వల్లే పార్టీకి ఇంత నష్టం జరిగిందని.. నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్‌లతో పాటు నేతలు కొందరు కాంగ్రెస్‌ వైపు చూస్తుంటే.. మరికొందరు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌.. పార్టీ పరిస్థితి చక్కదిద్దకపోతే మరింత నష్టం చవిచూడాల్సి వస్తుందని.. రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అదే జరిగితే బీఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దెబ్బ నుంచి ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. ఊహించని రీతిలో ఓటమి పాలవ్వడంతో.. కేసీఆర్ ఇప్పటికే బయటికి రావడంలేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాని ఆయన.. నల్గొండ సభకు మాత్రం హాజరై అధికార పార్టీపై విమర్శలు చేశారు. మళ్లీ ఇంతవరకూ ఎక్కడా కనిపించిందే లేదు. లోక్ సభ ఎన్నికల పుణ్యమా అని ఈసారైనా బయటికి వస్తారేమో చూడాలి.

Tags

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×