Cable Bridge: స్వేచ్చ బ్యూరో: తీగల వంతెన తుది మెరుగులు దిద్దుకుంటోంది. మానేరు నది పరవళ్ల మధ్యన ఇపుడు అందమైన తీగల వంతెన ప్రారంభానికి సిద్ధం అయింది. ఖమ్మం నగరంలో మున్నేరు పై జలగంనగర్-కా ల్వొడ్డు మధ్య 1.25కి.మీ. పొడవున ఈ వంతెన నిర్మాణం గత రెండేళ్లుగా సాగుతోంది. ఇందుకోసం రేవంత్రెడ్డి సర్కారు రూ.180 కోట్ల వ్యయ అంచనాలతో చేపట్టిన మున్నేరు తీగలవంతెన నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఖమ్మం నగరంలోని మున్నేరు పై నిర్మించే కాల్వొడ్డు తీగలవంతెన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగు తున్నాయి.
నిత్యం వేలాదిగా ప్రయాణాలు సాగిస్తున్న మున్నేరు పాత బ్రిడ్జి స్థానం నుండే ఇంతకాలం కోదాడ – ఖమ్మం మధ్య న ఇంకా సూర్యాపేట ఖమ్మం జిల్లాల మధ్య కూడా శిధిలావస్ధకు చేరిన ఇదే వంతెన గుండానే రాకపోకలు సాగిస్తున్నారు. ఖమ్మం మున్నేరు నది పై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, ఇక్కడి పలు ప్రాజెక్టులకు అవసరమైన సేవల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా సూచించారు. నిర్ణీత గడుపులోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్మాణ పనులు వేగంగా విస్తరిస్తున్నారు.
Also read: భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. దంచికొడుతున్న భారీ వర్షం!
ఇంకా మున్నేరు నది పై ఉన్న రాజీవ్ గృహకల్ప, రంగనాయక గుట్ట, ప్రకాష్ నగర్ చెక్ డ్యాం లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా బైపాస్ రోడ్డు నుంచి తీగల వంతెన వరకు ఎడమ, కుడి వైపుల మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు పూర్తిచేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆయనతో పాటు మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్&బీ ఎస్ఇ యాకుబ్ లు పనుల్ని పర్యవేక్షిస్తున్నారు.
Also read: Vamsi Goud: నల్గొండ జిల్లా గీత కార్మికుడి కొడుకు.. తెలంగాణ తరపున ఢిల్లీలో సంచలనం..!