Khammam : ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి భారత్ పెట్రోల్ బంక్లో ఒక పెట్రోల్ పంపునకు నిప్పు పెట్టారు. బంకు సిబ్బంది నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పెట్రోల్ పంపు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేయడంతో ముప్పు తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -