E-Paper
Advertisement

Kodanda Reddy: పదవి కోసం నేను ఢిల్లీకి వెళ్లను.. నా పనితీరు సీఎం, పీసీసీలకు తెలుసు..?

Kodanda Reddy: పదవి కోసం నేను ఢిల్లీకి వెళ్లను.. నా పనితీరు సీఎం, పీసీసీలకు తెలుసు..?

Kodanda Reddy: రాజ్యసభ సీటు కోసం తాను ఢిల్లీ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి(Kodhandarami Reddy) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పనితీరు సీఎం, పీసీసీ చీఫ్​ లకు తెలుసునని చెప్పారు. ప్రాధాన్యత పదవి ఇవ్వాలని ఇప్పటికే సీఎం దృష్టికి వెళ్లిందన్నారు. తనకు కచ్చితంగా వస్తుందనే నమ్మకం కూడా ఉన్నదన్నారు. గతంలో జాతీయ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్ష పోస్ట్ ఇవ్వాలని ఏఐసీసీ(AICC) ని అడిగానని, అనుకోని కారణాల వలన ఆ పోస్టు రాలేదన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని వివరించారు.

Also Read: Tea Powder: జనం ప్రాణాలతో చెలగాటం.. సింథటిక్ రసాయనాలతో నకిలీ టీ దందా!

నేనేంచేశానో అందరికి తెలుసు

పార్టీ పరంగా రాజ్యసభ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే బాగుంటుందన్నారు. పార్టీకి తానేం చేశాననేది నేతలందరికీ తెలుసునని వివరించారు. రాజ్య సభ సీటు భర్తీ కి హైకమాండ్ దృష్టిలో తాను తప్పక ఉంటానన్నారు. అర్హత ఉన్న వారికి పదవులు ఇవ్వాలన్నారు. పార్టీలో కార్యకర్తలకు పదవి లభించినప్పుడే గుర్తింపు దక్కుతుందన్నారు. కార్యకర్తలందరికీ పార్టీ న్యాయం చేస్తుందనే నమ్మకం ఉన్నదన్నారు. పదేళ్ల పాటు ఎంతో మంది పార్టీ కోసం శ్రమించారన్నారు.

Also Read: Gold Rate Dropped: కుప్పకూలుతున్న బంగారం ధరలు.. నేడు తులంపై ఎంత తగ్గిందంటే?

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×