Kodanda Reddy: రాజ్యసభ సీటు కోసం తాను ఢిల్లీ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి(Kodhandarami Reddy) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పనితీరు సీఎం, పీసీసీ చీఫ్ లకు తెలుసునని చెప్పారు. ప్రాధాన్యత పదవి ఇవ్వాలని ఇప్పటికే సీఎం దృష్టికి వెళ్లిందన్నారు. తనకు కచ్చితంగా వస్తుందనే నమ్మకం కూడా ఉన్నదన్నారు. గతంలో జాతీయ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్ష పోస్ట్ ఇవ్వాలని ఏఐసీసీ(AICC) ని అడిగానని, అనుకోని కారణాల వలన ఆ పోస్టు రాలేదన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని వివరించారు.
Also Read: Tea Powder: జనం ప్రాణాలతో చెలగాటం.. సింథటిక్ రసాయనాలతో నకిలీ టీ దందా!
పార్టీ పరంగా రాజ్యసభ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే బాగుంటుందన్నారు. పార్టీకి తానేం చేశాననేది నేతలందరికీ తెలుసునని వివరించారు. రాజ్య సభ సీటు భర్తీ కి హైకమాండ్ దృష్టిలో తాను తప్పక ఉంటానన్నారు. అర్హత ఉన్న వారికి పదవులు ఇవ్వాలన్నారు. పార్టీలో కార్యకర్తలకు పదవి లభించినప్పుడే గుర్తింపు దక్కుతుందన్నారు. కార్యకర్తలందరికీ పార్టీ న్యాయం చేస్తుందనే నమ్మకం ఉన్నదన్నారు. పదేళ్ల పాటు ఎంతో మంది పార్టీ కోసం శ్రమించారన్నారు.
Also Read: Gold Rate Dropped: కుప్పకూలుతున్న బంగారం ధరలు.. నేడు తులంపై ఎంత తగ్గిందంటే?