E-Paper
Advertisement

Komuram Bheem Project : ఒక్క ఎకరాకు నీరివ్వలేదు.. కేసీఆర్ పై రైతుల ఫైర్..

Komuram Bheem Project : ఒక్క ఎకరాకు నీరివ్వలేదు.. కేసీఆర్ పై రైతుల ఫైర్..

Komuram Bheem Project : కొమురం భీం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రధాన కాలువతోపాటు పిల్లకాలువల నిర్మాణం చేపట్టలేదని రైతులు వాపోయారు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం 10 టీఎంసీల నీటి సామర్థ్యంతో 45 వేల 500 ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో అడ గ్రామం వద్ద కొమురం భీం ప్రాజెక్టును నిర్మించింది. రైతులకు కాంగ్రెస్ హయాంలోనే న్యాయం జరిగిందని వారు తెలిపారు.

ఇప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు అందించలేదని.. వర్షంపైనే ఆధారపడి పంటలు పండించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చినప్పుడు ప్రాజెక్టు పై స్పందిస్తారనుకుంటే, ప్రాజెక్టు ప్రస్తావనే తీస్కురాలేదని మండిపడ్డారు. కేసీఆర్ కు కర్షకుల బాధలు పట్టవని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వం తమకు వద్దని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు.. వర్షాల కారణంగా ప్రాజెక్ట్ ఆనకట్ట సైడ్ వాలు దెబ్బతినడంతో పడిపోయింది. ఆనకట్టకు 100 మీటర్ల వరకు పగుళ్లు వచ్చాయి. ప్రాజెక్టుకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
ఆనకట్టను కాపాడుకోవడానికి ఇంజనీరింగ్ అధికారులు వరద తాకిడిని తట్టుకునేందుకు పాలితిన్ కవర్లను అమర్చారు. ప్రాజెక్టులోకి వచ్చే వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×