E-Paper
Advertisement

Konda surekha comments: మంత్రిపై పరువు నష్టం కేసు.. నేడు కోర్టుకు నాగార్జున.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ!

Konda surekha comments: మంత్రిపై పరువు నష్టం కేసు.. నేడు కోర్టుకు నాగార్జున.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ!
Advertisement

Konda surekha comments, Hero Nagarjuna Petition in nampally court: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ మేరకు ఈ కేసుపై హైదరాబాద్‌లోని నాంపల్లి మనోరంజన్ కోర్టు సోమవారం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నాగార్జున తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే తన స్టేట్‌మెంట్ తెలిపేందుకు మంగళవారం కోర్టుకు రావాలని న్యాయస్థానం నాగార్జునను ఆదేశించింది.

నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో నేడు నాగార్జున కోర్టుకు హాజరుకానున్నారు. కాగా, నాగార్జునతోపాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

హీరో అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని మంత్రి కొండా సురేఖ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున మంత్రిపై పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేశారని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నిజానిజాలు తెలుసుకోకుండా పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

హీరో నాగార్జున తన పరువుకు భంగం కలిగిందంటూ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యాజ్యంపై మంగళవారం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున, సమంతతో పాటు సినీ రంగ ప్రముఖులంతా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో మంత్రి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు.

Also Read: గాంధీభవన్‌లో మంత్రి తుమ్మల ముఖాముఖీ

తమ రాజకీయ ప్రయోజనాల కోసం సినీ పరిశ్రమలోని వ్యక్తులను టార్గెట్ చేయడం సరికాదని పలువురు సినీ రంగ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హీరో నాగార్జున కుటుంబం పేరును ప్రస్తావించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ప్రకటించింది. అయినప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×