KTR: గ్లోబరీన సంస్థ వివాదంపై కేటీఆర్ స్పందించారు. అది నాదంటున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి డిఫమేషన్ నోటీస్ పంపానని అన్నారు. సమాధానం ఇవ్వకుంటే న్యాయపరంగా ఎదుర్కుంటామిని కేటీఆర్ సమాదానం ఇచ్చారు. ఆ సంస్థ నాదైతే ఎందుకు రేవంత్ సర్కార్ ఒప్పందం చేసుకుందని అన్నారు. నేను ఏ రకంగానైనా సహకరిస్తా, దమ్ముంటే విచారణ చెపేయ్యండి అంటూ ఫైర్ అయ్యారు. ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షకు వెళ్దాం, సీఎం సిద్ధమా అని సవాల్ విసిరారు.
మనస్పూర్తిగా ఒకసారి కూడా జై తెలంగాణా అనని వ్యక్తి సీఎం రేవంత్ అని, బీజేపీని మోదీని అనాలంటే రేవంత్కు భయం అని గాటు వ్యాఖ్యలు చేశారు. పాత కేసుల బూజు దులుపుతారని భయం అని, సింగరేణి కుంభకోణాలు చేసినా సైలెంట్గా బీజేపీ ఉంటోందని, సీఎం రేవంత్ బామ్మర్ది అమృత్ కాంట్రాక్ట్ల కుంభకోణం చేస్తున్నాడని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్కి ఒక మూట, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడని కేటీఆర్ సెటేర్లు వేశారు. పగలు కాంగ్రెస్, రాత్రి బీజేపీ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. అర్ధరాత్రి కాళ్ళు పట్టుకునే దుస్తితి మాకు అలవాటు లేదని అన్నారు.
Also read: తెలంగాణలో కొత్త లిఫ్ట్ చట్టం.. ఇకపై నాణ్యత లేకపోతే కంపెనీలపై కఠిన చర్యలు
ఢిల్లీకి వెళ్తే బీజేపీ నేతల కార్లలో సీఎం రేవంత్ తిరుగుతున్నాడు. మీది ఏ జాతి అంటున్న రేవంత్ మాది తెలంగాణ జాతి అని కేటీఆర్ సమాదానం ఇచ్చారు. బ్యాగులు మోసే జాతి కాదు మాది. దగుల్బాజీ జాతి మాది కాదు. గ్లోబరీన, టాపింగ్, ఈ రేస్ లలో దేనిపై కేసులు పెడతావో పెట్టుకో మని విమర్షించారు. గ్లోబరీనా సంస్థ నాదైతే రాహుల్ గాంధీతో వచ్చి నా ఇంటి ముందు ధర్నా చేయమనండని అన్నారు. సీఎం స్థాయిలో ఉండి అలాంటి మాటలు సిగ్గు చేటని, జిల్లాల నుండే పాదయాత్ర ఉంటుందన్నారు. త్వరలో అన్ని వర్గాలను ఒక్కటి చేసేలా ప్రణాళిక ఉందని కేటీఆర్ తెలిపారు.
Also read: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ల్యాప్టాప్తో బైకర్ బిజీ బిజీ.. వీడియో వైరల్