E-Paper
Advertisement

KTR : కేటీఆర్.. జూటా మాటలు ఆపి.. జర ఈ లెక్కలు చూసి మాట్లాడు..!

KTR : కేటీఆర్.. జూటా మాటలు ఆపి.. జర ఈ లెక్కలు చూసి మాట్లాడు..!
Advertisement
KTR news today

KTR news today(Latest news in telangana):

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. అయినా కూడా బీఆర్ఎస్ నాయకుల గొప్పలకు హద్దులు లేవు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అహంకారం తగ్గినట్టు కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలలో కేటీఆర్ మాటలు కోటలు కడుతున్నారు. కారుకి రిపేర్ వచ్చిందని.. మళ్లీ రెట్టింపు స్పీడ్‌తో కారు హైవే మీదకు వస్తుందని అంటున్నారు. పార్టీ కార్యకర్తల సంగతి అటుంచితే పార్టీ నేతలే దొరవారిమీద గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అసలు పార్టీ క్యాడర్‌ అయితే కారు దిగి.. ప్రస్తుత సర్కారుకు సై అనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనుకుంటున్నారు.

Advertisement

ఇదిలా ఉంచితే చిన్న దొర ప్రతీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో 14 సీట్లు కోల్పోయామని లేదంటే ఇవ్వాళ మళ్లీ తామే అధికారంలో ఉండేవాళ్లమని కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో నిజమెంతో తెలుసుకుంటే కారు పార్టీ శ్రేణులే ఉస్సూరుమంటాయి.

కాంగ్రెస్ పార్టీ గెలిచిన 64 సీట్లలో వారి మెజార్టీ చూస్తే సారు మాటలన్నీ జూటా మాటలనేది అర్థమవుతుంది.

  • 50 వేలకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు- 12
  • 40 వేల నుంచి 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు- 8
  • 30 వేల నుంచి 40 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు- 12
  • 20 వేల నుంచి 30 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు- 9
  • 10 వేల నుంచి 20 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు-12
  • 5 వేల నుంచి 10 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు- 7
  • 5 వేల లోపు మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సీట్లు- 4
Advertisement

ఇక బీఆర్ఎస్ గెలిచిన 39 సీట్లలో మెజార్టీ లెక్కలు చూస్కుంటే

  • 5 వేల నుంచి 10 వేల మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచిన సీట్లు- 6

ఇక చేవెళ్ల నియోజకవర్గంలో కేవలం 268 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. 14 సీట్లలో తక్కువ మెజార్టీతో ఓడిపోతే.. వారు గెలిచిన సీట్లలో 7 సీట్లు అలానే గెలిచారన్న సంగతి చిన్నదొర మరిచిపోయినట్టు అనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రజలు మార్పు కోరుకున్నారన్న విషయాన్ని కారు పార్టీ ఓనర్లు గుర్తించాలి. 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ను ఉంచాలి అనుకున్న జనమే.. ఈ ఎన్నికల్లో దొరవారిని దించాలి అని అనుకున్నారు. ఇదే రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పు సృష్టించింది.

బీఆర్ఎస్ పార్టీ గుర్తించుకోవాల్సింది ఒక్కటే.. తెలంగాణ ప్రజలకు నమ్మడమూ తెలుసు.. ద్రోహం చేస్తే పొలిమేర అవతలికి తరమడమూ తెలుసు. నైజామోడి పైజామూడదీసీన తెలంగాణకు వీరిని ఓడగొట్టడం ఒకలెక్కా. ఇప్పటికైనా ఆహంకారాన్ని పక్కన పెట్టి కారుకు సరైన రిపేర్లు చేసుకుంటేనే తెలంగాణలో ఆ పార్టీకి అస్థిత్వం ఉంటుంది.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×