E-Paper
Advertisement

Aghori Latest Update: నార్సింగి పీఎస్‌లో అఘోరీ.. వర్షిణి ఎక్కడ ?

Aghori Latest Update: నార్సింగి పీఎస్‌లో అఘోరీ.. వర్షిణి ఎక్కడ ?

Aghori Latest Update: గత కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, సోషల్ మీడియాతో పాటు మీడియాల్లోనూ మారు మోగుతూ ఉంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో అఘెరీ వార్తలో నిలుస్తూ ఉంది. కొద్ది రోజుల క్రితం వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  ప్రస్తుతం ఈ జంట ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. కొత్తగా పెళ్లయిన ఈ జంటకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు.

విమర్శలు, వివాదాలు, అనంతరం ఎట్టకేలకు అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఉత్తర ప్రదేశ్ పారిపోయిన అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాంత్రిక పూజల పేరుతో మహిళ నుంచి 10 లక్షలు వసూళ్లు చేసి మోసానికి పాల్పడిన కేసులో అఘోరీని అరెస్ట్ చేశారు. పూజల పేరుతో డబ్బులు తీసుకుని మోసగించంతో.. ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడగ్గా అఘోరీ అలియాస్ శ్రీనివాస్ చంపుతానంటూ బెదిరింపులకు దిగారని సదరు మహిళ మొకిలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

యూపీలో అదుపులోకి తీసుకుని.. తెల్లవారుజామున నార్సింగి పీఎస్‌కు తరలించారు. అఘోరీతో పాటు ఇటీవల తనను వివహాం చేసుకున్న వర్షిణీని కూడా నగరానికి తరలించినట్లు తెలుస్తోంది. రంగా రెడ్డి జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఓ మహిళ లేడీ అఘోరీ మోసాలను ఇటీవల బయటపెట్టింది. లేడీ అఘోరీతో ఆరు నెలల క్రితం పరిచయమైనట్లు తెలిపింది. పరిచయమైన రెండు నెలల తర్వాత ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్‌కు డిన్నర్‌కు వచ్చిందని వెల్లడించింది. అప్పటి నుంచి తరచూ ఫోన్లు చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకునేదని ఒక పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని సదరూ మహిళ వెల్లడించింది.

లేడీ అఘోరీ మాటలు నమ్మి పూజకు అంగీకరించానని చెప్పంది. వారం రోజుల్లో పూజ చేద్దామని చెప్పడంతో నమ్మి.. ఖర్చుల కోసం ఐదు లక్షలు లేడీ అఘోరీ అకౌంట్లో వేశానని బాధిత మహిళ వాపోయింది. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయిని ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి పూజలు చేసిందని తెలిపింది. మరుసటి రోజు మరో ఐదు లక్షలు వేయాలని.. లేక పోతే పూజ విఫలమై పూజ నాశనం అవుతుందని లేడీ అఘోరీ బటపెట్టిందని చెప్పింది. ఈ తరుణంలో అఘోరీనీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తెల్లవారుజామున నార్సింగి పీఎస్‌కు తరలించారు.  అఘోరి శ్రీనివాస్ ని వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇక ఇటీవల అఘోరీ-శ్రీ వర్షిణి ఉదంతంలో అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను అఘోరి మొదటి భార్యనంటూ.. తనను మోసం చేశాడని రాధిక అనే మహిళ మోకిలా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: వైరుకు వేలాడిన తాగుబోతు.. గాల్లో ప్రాణాలు.. పైనుంచి పడేసరికి..

అరెస్టుపై అఘోరీ స్పందన..
అరెస్టుపై అఘోరీ స్పందించింది. చట్టం తన పని తాను చేసుకుంటుందని.. తాను పోలీసులకు, కోర్టుకు సహకరిస్తున్నాని తెలిపింది.

 

 

Related News

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

Big Stories

×