E-Paper
Advertisement

Mallareddy IT Raids : మల్లారెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ రైడ్స్..

Mallareddy IT Raids : మల్లారెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ రైడ్స్..
Advertisement

Mallareddy IT Raids : తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటు 65 గ్రూపులుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన కుమారుడు, అల్లుడు, బంధువులు ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలపై దాడులు నిర్వహించారు. దాదాపు 400 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఐటీ సోదాల్లో 10 కోట్లకుపైగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఒక్క మల్లారెడ్డి అల్లుడి ఇంట్లోనే మూడు కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం.

మరోవైపు ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి బోయిన్ పల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇష్టానుసారం వ్యవహరించారని ఫిర్యాదులో వెల్లడించారు. ఇదిలా ఉంటే..ఐటీ అధికారులు కూడా మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదుతో పీఎస్ వద్ద కొద్దిసేపు హైడ్రామా నడిచింది. మల్లారెడ్డి అల్లుడు మల్లిఖార్జున్ రెడ్డి ఇంట్లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయన టర్కీ నుంచి హైదరాబాద్ రానున్నారు.

Advertisement

మల్లారెడ్డి విద్యా సంస్థల్లో అక్రమాలు గుర్తించినట్లుగా ఐటీ అధికారులు నిర్ధారణకొచ్చారు. నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వసూలు చేసిన ఫీజులను రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులగా పెట్టినట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో బ్లాక్ లో నగదును తీస్తున్నట్లు తెలిపారు. నగదు మొత్తాన్ని నారాయణ ఆస్పత్రులకు తరలించినట్లుగా ఐటీ తెలిపింది. మల్లారెడ్డి తన ఆస్తులను తక్కువ చేసి చూపించారని నిర్ధారించారు. సొసైటీ కింద పన్ను రాయితీ పొందిన నారాయణ సంస్థలు…రాయితీలు ఉన్నప్పటికీ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఐటీ నిర్ధారణకొచ్చింది. సోదాలు ముగిసిన అనంతరం మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చారు. సోమవారం తన ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు.

మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డిని ఐటీ అధికారులు బ్యాంక్ కు తీసుకెళ్లారు. కోఠిలోని స్టేట్ బ్యాంక్ కు తీసుకువెళ్లారు. అక్కడ మొత్తం 12 లాకర్లను గుర్తించి..ఎనిమిదింటిని తెరిచి చూసినట్లు తెలిసింది.

Advertisement

ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు రాయించుకున్నారని చెప్పారు. నకిలీ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని మండిపడ్డారు.
వంద కోట్లు డోనేషన్లు తీసుకున్నట్లు బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. ల్యాప్ టాప్, ఫోన్ అధికారులు మర్చిపోతే…తానే స్వయంగా పంపించానని అంటున్నారు. తన కొడుకుతో కూడా బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×