E-Paper
Advertisement

Fire Accident: సరూర్ నగర్ టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.80 లక్షల ఆస్తి నష్టం

Fire Accident: సరూర్ నగర్ టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.80 లక్షల ఆస్తి నష్టం
Advertisement

Fire Accident: రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ వైపు నుంచి వస్తుందే తెలియక ప్రజలు భయాందోళనకు గురవుత్తున్నారు. నిత్యం ఏదొక ప్రదేశంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగా రెడ్డి జిల్లా సరూర్ నగర్ మణికంఠ టింబర్‌ డిపో దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది.

శనివారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా షాపులో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటా హుటినా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో షాపులో దాదాపు 80 నుంచి 85 లక్షల విలువ చేసే స్టాక్ ఉందని, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారని డిపో యజమాని తెలిపారు. అగ్నిప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా స్పష్టత రాలేదు.

Advertisement

కాగా శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని ఓహోటల్‌ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అరేబియన్ నైట్స్ హోటల్‌ సెకండ్ ఫ్లోర్‌లో.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆరుగురు చిక్కుకుపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. వారిని బయటకు తీశారు. ఆరుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా..? లేక మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Also Read: యువతిపై గ్యాంగ్‌రేప్ పట్టించుకోని భర్త.. ప్రియుడితో కలిసి ఆమె ఏం చేసిందంటే..

Advertisement

మరోవైపు హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీలో ఓ వస్త్ర దుకాణంలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షాపు టెర్రస్‌పై నుంచి మంటలు వస్తున్నట్లు గమనించిన షాపు యాజమాన్యం.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది.. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. టెర్రస్‌పై పేరుకుపోయిన చెత్త, కట్టెలకు మంటలు అంటుకుని ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×