Ponguleti Srinivas Reddy: స్వేచ్ఛ, బ్యూరో: నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్ఎస్ నాయకులని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) విమర్శించారు. అసెంబ్లీలో మంగళవారం కేటీఆర్ మాట్లాడుతూ తమపార్టీ టికెట్ పై గెలిచిన వ్యక్తి.. కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేస్తే ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారని అన్నారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ స్పీకర్ బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని సూచించారు. జ్యూడిషియల్ కోర్టుకు పోతాం.. తీర్పు ఇస్తే పైకోర్టుకు వెళ్తాం.. జడ్జిమెంట్ చదవకముందే అభియోగాలు చేశారు.. ప్రశ్నించే ధోరణి మానుకోవాలి.
Also Read: LPG Supply: ఏపీలో గ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి దిగిన చంద్రబాబు
జడ్జిమెంట్ చదవి మాట్లాడాలని సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై పొంగులేటి స్పందించారు. స్పీకర్ జడ్జిమెంట్ ను కేటీఆర్ ప్రశ్నించడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. మున్సిపల్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. కట్టు కథలు, మాటల గారడీ అని దుయ్యబట్టారు. జడ్జీ స్థాయిలో ఉన్న స్పీకర్ పై మాట్లాడటం ఏంటని నిలదీశారు. సీనియర్ శాసనసభ్యుడిగా కేటీఆర్ అనుభవం ఉన్న వ్యక్తి..కట్టుకథలు ప్రభుత్వం పదేపదే చెప్పారన్నారు. నాలుగు సార్లు ఎందుకు ఓడిపోయారు.. గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు..మీరు చెప్పింది నిజమై ఉంటే ప్రజలు మీకు ఓట్లు వేసి ఉండేవారు కదా? ఓట్ల వేయకపోతే మీరు అవగాహన చేసుకోకుండా కట్టు కథలు.. మాటల గారడీలు మానుకోవాలని సూచించారు. దీనికి కేటీఆర్ స్పందించి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం మా బాధ్యత అని పేర్కొన్నారు.
Also Read: Ugadi festival: ఉగాది పండుగ రోజు ఆ పనులు అసలు చేయకూడదట