E-Paper
Advertisement

Mining Course: సీఎం రేవంత్‌కు మంత్రి పొన్నం లేఖ..!

Mining Course: సీఎం రేవంత్‌కు మంత్రి పొన్నం లేఖ..!
Advertisement

Mining Course: స్వేచ్ఛ బ్యూరో: హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు మంజూరుకు సీఎం కి విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బొగ్గు తవ్వకాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో..

దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచస్థాయిలో కూడా అర్హత కలిగిన మైనింగ్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో బి.టెక్ (మైనింగ్ ఇంజనీరింగ్) కోర్సు అందుబాటులో చాలా పరిమితంగా ఉందని, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో ఉన్న అధిక ఫీజుల కారణంగా ఈ కోర్సును అభ్యసించలేకపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also read: వీటితో తక్కువ బడ్జెట్‌లో.. మీ ఇంటికి 24 గంటల సేఫ్టీ

మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు..

హుస్నాబాద్ ప్రాంతం గనుల పరిశ్రమలకు సమీపంలో ఉండటంతో పాటు బొగ్గు గనుల ప్రాంతానికి అనుసంధానమై ఉండటం వల్ల, ఇక్కడ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు ప్రారంభించడం విద్యార్థులకు మరియు పరిశ్రమలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ (మైనింగ్ ఇంజనీరింగ్) కోర్సును తక్షణమే మంజూరు చేయడంతో పాటు అవసరమైన బోధన మరియు సాంకేతిక సిబ్బందిని కూడా నియమించాలని ముఖ్యమంత్రిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

Advertisement

Also Read: గాంధీభవన్‌ను షేక్ చేస్తున్న పైరవీల చిట్టా.. ఉద్యోగాల పేరిట భారీ మోసం..!

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×